Saturday, June 20, 2026 08:32 AM
Saturday, June 20, 2026 08:32 AM

వైసీపీకి పవన్ అదిరిపోయే కౌంటర్..!

తాజాగా ఓ మీడియా ఛానల్ అధినేత చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు నిరసనలు వ్యక్తం చేయడం పట్ల.. భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిణామంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యారు. ఇటీవలి వైసీపీ నేతలు చేస్తున్న వ్యక్తిగత దూషణలు, దిగజారుడు రాజకీయాలను ఆయన ఎండగట్టారు. రాజకీయాల్లో విమర్శలు ఉండాలి కానీ, అవి వ్యక్తిగత స్థాయికి దిగజారకూడదని హితవు పలికారు. దాడులు చేయడం తమ సంస్కృతి కాదని, అరాచక వ్యాఖ్యలకు న్యాయస్థానాల్లో కూడా తేల్చుకునే అవకాశం ఉందని సూచించారు.

Also Read : బ్రేకింగ్ : రెడ్డప్పగారి మాధవి, బీటెక్ రవిపై లోకేష్ సీరియస్

గతంలో వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ పవన్ తీవ్ర విమర్శలు చేశారు. సొంత భార్యను కారుతో పోల్చి మాట్లాడిన జగన్ వాచాలత్వాన్ని ప్రజలు ఇంకా మర్చిపోలేదు. అంతకంటే దిగజారుడుతనం ఇంకేముంటుంది..? అని ఆయన ప్రశ్నించారు. గత అసెంబ్లీలో అప్పటి ప్రతిపక్ష నేత.. చంద్రబాబు నాయుడు సతీమణిపై అత్యంత నీచంగా వ్యాఖ్యలు చేస్తుంటే, జగన్ వాటిని అడ్డుకోకపోగా ప్రోత్సహించారని పవన్ మండిపడ్డారు. వైసీపీ నేతలు వాడుతున్న అభ్యంతరకర భాషను కూటమి పార్టీలు అదే స్థాయిలో తిప్పికొట్టాల్సిన అవసరం లేదని పవన్ సూచించారు.

Also Read : దేవాదాయ శాఖలో ఏసీబీ “శాంతి” హోమం..!

దాడులు సమాధానం కాదు. మనం ప్రజాస్వామ్య పంథాను అనుసరించాలి. చట్టానికి ఎవరూ చుట్టాలు కాదు, న్యాయస్థానాల్లోనే పోరాడి వారికి గుణపాఠం చెబుదామని కూటమి శ్రేణులకు పిలుపునిచ్చారు. వైసీపీ నేతలు నిత్యం దిగజారి మాట్లాడుతున్నారని, వారి భాష సభ్య సమాజం అసహ్యించుకునేలా ఉందని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎదుటివారి వ్యక్తిత్వాన్ని కించపరచడమే వైసీపీ విధానంగా మారిందని, ఇలాంటి ప్రవర్తనను ప్రజలు గమనిస్తున్నారని ఆయన హెచ్చరించారు. ఇక టీడీపీ, జనసేన సోషల్ మీడియా, గతంలో వైసీపీ నేతలు మాట్లాడిన వీడియోలను వైరల్ చేస్తోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

సాయికృష్ణ కేసులో వైసీపీ...

విజయవాడ రౌడీ షీటర్‌ గాదె సాయికృష్ణ...

బ్రేకింగ్: అల్లు అర్జున్‌...

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య...

తెలంగాణాలో జనసేన తొలి...

గత కొన్నాళ్ళుగా తెలంగాణాలో పార్టీ బలోపేతం...

బ్రేకింగ్: కొడాలి అరెస్ట్...

ఏపీలో వైసీపీ కీలక నేతలకు చట్టపరమైన...

‘పెద్ది’కి బిగ్ సర్‌ప్రైజ్.....

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

రఘురామ కేసుపై హైకోర్ట్...

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఐపీఎస్ అధికారి సునీల్‌...

పోల్స్