Sunday, June 21, 2026 01:59 PM
Sunday, June 21, 2026 01:59 PM

ఇండియా వర్సెస్ పాకిస్తాన్ కు ఆ హడావుడి ఎక్కడ..?

భారత్ – వర్సెస్ పాకిస్తాన్ అనగానే హడావుడి ఓ రేంజ్ లో ఉంటుంది. క్రికెట్ అయినా ఏ పోటీ అయినా సరే రెండు దేశాల అభిమానుల సందడి పీక్స్ లో ఉంటుంది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఆసియా కప్ లో హడావుడి కనపడటం లేదు. రెండు దేశాల మధ్య జరగబోతున్న హైవోల్టేజ్ టి20 మ్యాచ్ కు అసలు సందడి కరువైంది. కనీసం మైదానంలో టికెట్ లు కూడా పూర్తిగా బుక్ కాలేదనే వార్త కలవరపెడుతోంది. 40 శాతం టికెట్ లు ఇంకా అన్ సొల్ద్ అంటూ జాతీయ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

Also Read : మెగా ఫ్యాన్స్ కు 18 ఇయర్స్ గిఫ్ట్ రెడీ

ఇటు సోషల్ మీడియాలో కూడా ఈ పోరు గురించి పెద్దగా హడావుడి లేదనే చెప్పాలి. ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో కూడా అన్ని రకాల మీడియాను షేక్ చేసింది ఈ రెండు దేశాల మధ్య మ్యాచ్. అయితే ఆసియా కప్ లో ఆ రేంజ్ బజ్ లేకపోవడానికి ప్రధాన కారణాలు ఉన్నాయి. పహల్గాం ఉగ్రదాడి తర్వాత రెండు దేశాల మధ్య క్రికెట్ వద్దనే డిమాండ్ లు వినిపించాయి. ద్వైపాక్షిక పోరు మాత్రమే కాదు, మెగా టోర్నీలలో కూడా వద్దని కోరారు ఫ్యాన్స్. అటు మాజీ క్రికెటర్లు ఆడిన లీగ్ లో కూడా భారత ఆటగాళ్ళు మ్యాచ్ ను బాయ్ కాట్ చేసారు.

Also Read : టార్గెట్ పంచాయితీ.. 14 జిల్లాలకు కొత్త ఎస్పీలు..!

ఇప్పుడు యువ ఆటగాళ్ళు కూడా అలాగే బాయ్ కాట్ చేయాలని ఫ్యాన్స్ నుంచి డిమాండ్ ఉంది. దానికి తోడు సీనియర్ ఆటగాళ్ళు లేకపోవడం కూడా మైనస్ అయింది. గత 15 ఏళ్ళలో భారత్ – పాకిస్తాన్ పోరు అంటే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లేకుండా లేదు. కాని ఈసారి మాత్రం ఆ ఇద్దరూ లేరు. దీనితో మ్యాచ్ కు పెద్దగా హడావుడి జరగడం లేదు. ఛాంపియన్స్ ట్రోఫీలో ఈ ఇద్దరూ ఉండటంతో ఫ్యాన్స్ మైదానానికి క్యూ కట్టారు. ఏది ఏమైనా ఆసియా కప్ మాత్రం ఈసారి చప్పగానే సాగుతోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

SBI వర్సెస్ తెలంగాణా...

రాయదుర్గం భూముల కేటాయింపు వ్యవహారంలో స్టేట్...

తిరుపతిలో కేఎఫ్‌సీ, డొమినోస్‌...

ప్రముఖ అంతర్జాతీయ ఫుడ్ బ్రాండ్ల ఆహార...

తిరుపతిలో వడ్డీ మాఫియా.....

తిరుపతి నగరంలో వడ్డీ వ్యాపారం పేరుతో...

సాయికృష్ణ కేసులో వైసీపీ...

విజయవాడ రౌడీ షీటర్‌ గాదె సాయికృష్ణ...

బ్రేకింగ్: అల్లు అర్జున్‌...

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య...

తెలంగాణాలో జనసేన తొలి...

గత కొన్నాళ్ళుగా తెలంగాణాలో పార్టీ బలోపేతం...

పోల్స్