Sunday, September 20, 2026 07:50 AM
Sunday, September 20, 2026 07:50 AM

చంద్రబాబు వల్లే ఇది సాధ్యమైంది.. మందకృష్ణ భావోద్వేగం

ఎస్సీ వర్గీకరణపై సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పుతో ఇప్పుడు మాదిగలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ సిఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాసేపటి క్రితం సుప్రీం కోర్ట్ రాజ్యాంగ ధర్మాసనం కీలక తీర్పు వెల్లడించింది. ఉప వర్గీకరణ చేయవద్దు అంటూ గతంలో ఇచ్చిన తీర్పుని సుప్రీం కోర్ట్ పక్కన పెట్టింది. 6;1 మెజారిటీ తో సుప్రీం తీర్పు వెల్లడించింది. సుప్రీం తీర్పును అనుసరించి రాష్ట్రాలు మార్గదర్శకాలు రూపొందించుకోవాలని తీర్పులో సుప్రీం కోర్ట్ స్పష్టం చేసింది.

దీనిపై ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ హర్షం వ్యక్తం చేసారు. ఈ 30 ఏళ్ళ పోరాటంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని అన్నారు. అనుకూల తీర్పు ఇచ్చిన జడ్జిలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ప్రక్రియను ముందుకు నడిపించిన వెంకయ్య నాయుడు, కిషన్ రెడ్డికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. గతంలో వర్గీకరణ చేసినప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నదీ చంద్రబాబే అని, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నదీ చంద్రబాబే అని, గత ఎన్నికల్లో మద్దతు ఇచ్చినందుకు చంద్రబాబు తమకు న్యాయం చేస్తారని మందకృష్ణ పేర్కొన్నారు.

నేడు ఎస్సీ వర్గీకరణకు పుణ్యం చంద్రబాబు నాయుడు గారిదే అని ఆయన కొనియాడారు. ఆనాడు చంద్రబాబు నాయుడు ఎస్సీ వర్గీకరణ చట్టం స్వీకారం చుట్టారు… నేడు తీర్పు వచ్చే సమయం లో ముఖ్యమంత్రి హోదాలో ఉండగానే మాకు వర్గీకరణ జరిగడం అనేది గర్వ కారణం అన్నారు. చంద్రబాబు నాయుడు వర్గీకరణ చేయకపోతే వేలాది మందికి ఉద్యోగాలు వచ్చేవి కావని ఆయన పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్న చంద్రబాబు కు ప్రత్యేక ధన్యవాదాలు అన్నారు మంద కృష్ణ.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుమల లడ్డూ పై,...

ఈడీ అంటే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌.. ఈ...

ఇప్పటికీ వారికే పదవులు.....

కూటమి ప్రభుత్వం ఏర్పడి, దాదాపు రెండున్నర...

సాయిరెడ్డి.. నెట్టుకు రాగలరా.....

కొత్త ఎపుడూ వింతే. అందుకే కొత్తగా...

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

పోల్స్