Saturday, September 19, 2026 04:14 PM
Saturday, September 19, 2026 04:14 PM

వార్నింగ్ ఇస్తున్నా పట్టించుకోని ఎమ్మెల్యేలు

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ఎమ్మెల్యేలు అధినేతలను లెక్క చేయడం లేదా…? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. రాజకీయంగా విపక్షం బలహీనంగా ఉన్నా కొందరు నేతల వ్యవహారం మాత్రం కొంప ముంచే అవకాశం స్పష్టంగా కనపడుతోంది. అధినేతలు హెచ్చరిస్తున్నా లెక్క చేయకపోవడం ఆందోళన కలిగిస్తోంది. అసలు ఏం జరుగుతోంది, ఎక్కడ సమస్యలు వస్తున్నాయి అనేది ఒకసారి చూద్దాం. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల పని తీరు విషయంలో కూటమి సర్వేలు చేయించడం మొదలుపెట్టింది.

అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు కాకముందే ఓ సర్వే పూర్తి చేసి మార్కులు కూడా ఇచ్చారు. ఇటీవల ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో ఎంపీలలో శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు మొదటి స్థానంలో ఉంటే… వైసీపీకి చెందిన ఓ ఎంపీ ఆఖరి స్థానంలో ఉన్నారు. ఇక ఎమ్మెల్యేల పని తీరు విషయంలో, మంత్రుల పేషీల విషయంలో ఆ సంస్థ కీలక విషయాలను తమ వేగుల ద్వారా తెలుసుకుని సిఎంకు నేరుగా అందించింది. ప్రజలతో, కార్యకర్తలతో ఆ సంస్థ నేరుగా మాట్లాడి కీలక విషయాలను సేకరించడం మొదలుపెట్టింది.

Also Read : రెడ్ బుక్ మూడో చాప్టర్.. లోకేష్ సంచలన వ్యాఖ్యలు

ఎమ్మెల్యేలు ఇసుకలో జోక్యం చేసుకుంటున్నారా…? మద్యం విషయంలో ప్రమేయం ఉందా…? స్థానికంగా ఉన్న సహజ వనరుల విషయంలో అక్రమాలు ఉన్నాయా…? ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా, వ్యాపారాలు చేసుకుంటున్నారా…? మంత్రులు మీ నియోజకవర్గాల్లో తిరుగుతున్నారా…? ఇలాంటి కీలక ప్రశ్నలు నేరుగా ప్రజలనే అడుగుతున్నారు. ఈ సందర్భంగా ఆ సంస్థ నాయకులను హెచ్చరిస్తున్నా సరే… వారిలో మార్పు రావడం లేదట. అయితే కొందరు ఎమ్మెల్యేలు ఇంకా 5 ఏళ్ళు ఉందిగా అని ధీమాగా ఉండటం సమస్యగా మారిందని ఆ సంస్థ హెచ్చరించింది. ఇదే విషయాన్ని ఆ సంస్థ టిడిపి అధినేతకు నివేదిక అందించినట్లు తెలుస్తుంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

ఏపీ లిక్కర్ కుంభకోణం.....

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత వైఎస్సార్ కాంగ్రెస్...

రేవంత్ దెబ్బ.. బీఆర్ఎస్‌కు...

ఏదో అనుకుంటే.. మరేదో జరిగినట్లు ఉంది...

దానం నాగేందర్ కు...

ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తెలంగాణ...

పోల్స్