Sunday, June 21, 2026 05:59 AM
Sunday, June 21, 2026 05:59 AM

వార్నింగ్ ఇస్తున్నా పట్టించుకోని ఎమ్మెల్యేలు

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ఎమ్మెల్యేలు అధినేతలను లెక్క చేయడం లేదా…? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. రాజకీయంగా విపక్షం బలహీనంగా ఉన్నా కొందరు నేతల వ్యవహారం మాత్రం కొంప ముంచే అవకాశం స్పష్టంగా కనపడుతోంది. అధినేతలు హెచ్చరిస్తున్నా లెక్క చేయకపోవడం ఆందోళన కలిగిస్తోంది. అసలు ఏం జరుగుతోంది, ఎక్కడ సమస్యలు వస్తున్నాయి అనేది ఒకసారి చూద్దాం. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల పని తీరు విషయంలో కూటమి సర్వేలు చేయించడం మొదలుపెట్టింది.

అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు కాకముందే ఓ సర్వే పూర్తి చేసి మార్కులు కూడా ఇచ్చారు. ఇటీవల ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో ఎంపీలలో శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు మొదటి స్థానంలో ఉంటే… వైసీపీకి చెందిన ఓ ఎంపీ ఆఖరి స్థానంలో ఉన్నారు. ఇక ఎమ్మెల్యేల పని తీరు విషయంలో, మంత్రుల పేషీల విషయంలో ఆ సంస్థ కీలక విషయాలను తమ వేగుల ద్వారా తెలుసుకుని సిఎంకు నేరుగా అందించింది. ప్రజలతో, కార్యకర్తలతో ఆ సంస్థ నేరుగా మాట్లాడి కీలక విషయాలను సేకరించడం మొదలుపెట్టింది.

Also Read : రెడ్ బుక్ మూడో చాప్టర్.. లోకేష్ సంచలన వ్యాఖ్యలు

ఎమ్మెల్యేలు ఇసుకలో జోక్యం చేసుకుంటున్నారా…? మద్యం విషయంలో ప్రమేయం ఉందా…? స్థానికంగా ఉన్న సహజ వనరుల విషయంలో అక్రమాలు ఉన్నాయా…? ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా, వ్యాపారాలు చేసుకుంటున్నారా…? మంత్రులు మీ నియోజకవర్గాల్లో తిరుగుతున్నారా…? ఇలాంటి కీలక ప్రశ్నలు నేరుగా ప్రజలనే అడుగుతున్నారు. ఈ సందర్భంగా ఆ సంస్థ నాయకులను హెచ్చరిస్తున్నా సరే… వారిలో మార్పు రావడం లేదట. అయితే కొందరు ఎమ్మెల్యేలు ఇంకా 5 ఏళ్ళు ఉందిగా అని ధీమాగా ఉండటం సమస్యగా మారిందని ఆ సంస్థ హెచ్చరించింది. ఇదే విషయాన్ని ఆ సంస్థ టిడిపి అధినేతకు నివేదిక అందించినట్లు తెలుస్తుంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుపతిలో కేఎఫ్‌సీ, డొమినోస్‌...

ప్రముఖ అంతర్జాతీయ ఫుడ్ బ్రాండ్ల ఆహార...

తిరుపతిలో వడ్డీ మాఫియా.....

తిరుపతి నగరంలో వడ్డీ వ్యాపారం పేరుతో...

సాయికృష్ణ కేసులో వైసీపీ...

విజయవాడ రౌడీ షీటర్‌ గాదె సాయికృష్ణ...

బ్రేకింగ్: అల్లు అర్జున్‌...

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య...

తెలంగాణాలో జనసేన తొలి...

గత కొన్నాళ్ళుగా తెలంగాణాలో పార్టీ బలోపేతం...

బ్రేకింగ్: కొడాలి అరెస్ట్...

ఏపీలో వైసీపీ కీలక నేతలకు చట్టపరమైన...

పోల్స్