Sunday, June 21, 2026 02:48 AM
Sunday, June 21, 2026 02:48 AM

కేరళ నర్సు కథ సుఖాంతమా..? ఉరిశిక్ష ఆగినట్టేనా..?

కేరళ నర్సు నిమీష ప్రియకు విధించిన మరణ శిక్షపై పెద్ద ఎత్తున ఆందోళన నెలకొన్న నేపధ్యంలో యెమెన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తనను వేధిస్తున్న వ్యక్తిని చంపినందుకు స్థానిక కోర్ట్ ఆమెకు మరణ శిక్ష విధించింది. కేరళకు చెందిన నర్సును కాపాడటానికి చివరి ప్రయత్నంగా భారత అధికారులు ఆమె కుటుంబంతో చర్చించారు. ఈ తరుణంలో నిమిషా ప్రియ ఉరిశిక్ష వాయిదా పడింది. ప్రియాకు రేపు ఉరిశిక్ష విధించాల్సి ఉంది. కానీ హత్యకు గురైన వ్యక్తి కుటుంబం ఉరి శిక్షను వాయిదా వేయాలని కోరడంతో శిక్షను వాయిదా వేసారు.

Also Read : ఆ 5 తప్పులే భారత్ ను ఓడించాయా..?

అయితే ఆమెను విడుదల చేయడం మాత్రం సాధ్యం కాదని తెలుస్తోంది. ఆమె ప్రస్తుతం హౌతీల ఆధీనంలో ఉన్న యెమెన్ రాజధాని సనాలో ఉంది. హౌతీ తిరుగుబాటుదారులతో మన దేశానికి ఎలాంటి దౌత్య సంబంధాలు లేవు. భారత ప్రభుత్వం నిన్న ఉరిశిక్షను ఆపడానికి తన పరిమితుల్లో ఉన్న ప్రతీ ఒక్క ప్రయత్నమూ చేసింది. నిమిషా ప్రియ 2008లో కేరళ నుంచి ఉద్యోగ నిమిత్తం యెమన్ వెళ్లి అక్కడ నర్సుగా జాయిన్ అయింది. ముందు అక్కడున్న స్థానిక ఆస్పత్రులలో ఆమె పని చేసింది.

Also Read : చంద్రబాబుతో భేటీకి రేవంత్ నో..!

ఆ తర్వాత చట్ట ప్రకారం స్థానిక పౌరుడు అయిన తలాల్ అబ్దోల్ మెహదీతో కలిసి సొంత క్లీనిక్ ఓపెన్ చేసింది. అయితే మెహదీ ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. ఆమె డబ్బు లాక్కోవడమే కాకుండా.. ఆమె పాస్పోర్ట్ కూడా లాక్కున్నాడు. ఆమె దేశం విడిచి వెళ్ళకుండా ఉండేందుకు గానూ తీవ్రంగా వేధించడంతో.. 2017 లో ఆమె అతనికి మత్తు మందు ఇచ్చింది. అతను స్పృహ కోల్పోయిన తర్వాత ఆమె పాస్‌పోర్ట్‌ ను లాక్కోవాలని ప్రయత్నం చేయగా.. అతను ప్రాణాలు కోల్పోయాడు. ఆమె యెమెన్ నుండి పారిపోవాలని ప్రయత్నం చేస్తున్న సమయంలో స్థానిక అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుపతిలో కేఎఫ్‌సీ, డొమినోస్‌...

ప్రముఖ అంతర్జాతీయ ఫుడ్ బ్రాండ్ల ఆహార...

తిరుపతిలో వడ్డీ మాఫియా.....

తిరుపతి నగరంలో వడ్డీ వ్యాపారం పేరుతో...

సాయికృష్ణ కేసులో వైసీపీ...

విజయవాడ రౌడీ షీటర్‌ గాదె సాయికృష్ణ...

బ్రేకింగ్: అల్లు అర్జున్‌...

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య...

తెలంగాణాలో జనసేన తొలి...

గత కొన్నాళ్ళుగా తెలంగాణాలో పార్టీ బలోపేతం...

బ్రేకింగ్: కొడాలి అరెస్ట్...

ఏపీలో వైసీపీ కీలక నేతలకు చట్టపరమైన...

పోల్స్