Wednesday, August 5, 2026 03:18 PM
Wednesday, August 5, 2026 03:18 PM

అధికారులను వెంటాడుతున్నారు.. సిద్దమవుతున్న మరిన్ని కేసులు

ఆంధ్రప్రదేశ్ లో గత అయిదేళ్ళ నుంచి కొందరు అధికారులు ఏ రేంజ్ లో చెలరేగిపోయారో చూస్తూనే ఉన్నాం. రాజకీయ నాయకుల ఆదేశాలతో తాము ప్రభుత్వ ఉద్యోగులం అనే విషయాన్ని కూడా మర్చిపోయి ప్రవర్తించారు చాలా మంది అధికారులు. ఐపిఎస్ అధికారులు, ఐఏఎస్ అధికారులు అందరూ కూడా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడమే కాదు రాజకీయ నాయకులపై పగను తాము కూడా పంచుకున్నారు. ఇప్పుడు వారిది ఒక్కొక్కరిది బెండ్ తీస్తోంది కూటమి సర్కార్. వరుసగా అధికారులపై కేసులు నమోదు అవుతున్నాయి.

Also Read : నేను తగ్గను.. బెనిఫిట్ షోస్ ఉండవు: రేవంత్ క్లారిటీ

గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ పలువురు ఉన్నతాధికారులపై వరుస కేసులు నమోదు చేసారు. ఇప్పటికే కీలక పదవుల్లో ఉన్నవారిపై భారీగా కేసులు నమోదు అయ్యాయి. మదనపల్లి ఫైల్స్ నుండి కేసుల పర్వం మొదలైంది. లిక్కర్, మైనింగ్, సాండ్ ,కాకినాడ పోర్ట్ అవకతవకలపై ఇప్పటికే భారీగా సీఐడీ కేసులు నమోదు చేసింది. కొద్దిరోజుల క్రితం సోషల్ మీడియా పోస్టింగ్స్ పై భారీ ఎత్తున కేసులు నమోదు అయ్యాయి.

Also Read : జగన్‌కు తలనొప్పిగా మారిన కడప..!

ఇక రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ప్రత్యేక సీట్ ఏర్పాటు చేసారు. ముంబై నటి జేత్వాని కేస్ లో పలువురు ఐపీఎస్ అధికారులపై ఇంకా విచారణ కొనసాగుతోంది. తాజాగా సీనియర్ ఐపీఎస్ అధికారి మాజీ సీఐడీ చీఫ్, ఫైర్ డీజీ తో పాటు సమాచార శాఖ కమిషనర్ పై ఏసీబీ కేస్ నమోదు చేసింది. ప్రస్తుతం ఫైబర్ నెట్ అవకతవకలపై కేసులకు రంగం సిద్ధం చేసారు. ఒకవైపు సిఐడి మరోవైపు ఏసీబీ తమ విధులు నిర్వహిస్తుంటే… కాకినాడ పోర్టు బదలలింపు వ్యవహారంలో రంగంలోకి ఈడి దిగింది. రాష్ట్రవ్యాప్తంగా ఇంకా కేసులు నమోదు కానున్నాయి. చాలా కేసుల్లో ఇప్పటికే విచారణకు హాజరవుతున్న అధికారులు… కోర్టుల్లో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా అధికారులకు ఉచ్చు బిగుస్తోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

జంతర్ మంతర్ నిరసనల్లో...

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్...

బీసీలకు ఏపీ సర్కార్...

ఆంధ్రప్రదేశ్‌లో వెనుకబడిన తరగతుల సామాజికవర్గాల భద్రత,...

కృష్ణా నదిని మింగేస్తున్నారా..?...

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలో కృష్ణానది...

మళ్లీ వైసీపీలోకి విజయసాయిరెడ్డి..?...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం...

నవంబర్ వరకు నో...

తెలంగాణ స్థానిక సంస్థల పోరు కోసం...

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

పోల్స్