Wednesday, August 5, 2026 09:50 PM
Wednesday, August 5, 2026 09:50 PM

నందిగం సురేష్ ను దూరం పెట్టేసిన జగన్..?

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో బాపట్ల ఎంపీగా ఉన్న నందిగం సురేష్ కు వైఎస్ జగన్ అత్యంత ప్రాధాన్యత ఇచ్చేవారు. కృష్ణ, గుంటూరు జిల్లాల్లో ఎక్కడ బహిరంగ సభ నిర్వహించిన ఏదైనా అధికారిక కార్యక్రమాలు నిర్వహించిన సరే నందిగం సురేష్ ను వేదికపై తన పక్కనే కూర్చోబెట్టుకునేవారు వైయస్ జగన్. అయితే తాజాగా నందిగం సురేష్ కు వైసీపీలో ప్రాధాన్యత తగ్గించారు జగన్. 2014 నుంచి 2019 వరకు జగన్ చేసిన కొన్ని కార్యక్రమాల్లో సురేష్ కీలకపాత్ర పోషించారు. అమరావతిలో జరిగిన కొన్ని విధ్వంశాల వెనుక నందిగం సురేష్ ఉన్నారనే ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చాయి.

Also Read : 7 నెలల తర్వాత తెలంగాణా భవన్ కు.. అసెంబ్లీకి కూడా.. ?

ఇక ఇటీవల సురేష్ జైలుకు వెళ్లి దాదాపు 3 నెలలు తర్వాత బయటకు వచ్చారు. సురేష్ బయటికి వచ్చినప్పటి నుంచి జగన్ ఆయనకు ప్రాధాన్యత తగ్గించారు అని ఆరోపణలు వినపడుతున్నాయి. తాజాగా గుంటూరు మిర్చి యార్డ్ పర్యటనకు వెళ్ళిన వైయస్ జగన్ నందిగం సురేష్ తో కనీసం మాట కూడా మాట్లాడలేదు. ఇక జగన్ భద్రత సిబ్బంది కూడా సురేష్ ను దూరంగానే ఉంచారు. సురేష్ ను గతంలో ఎన్నోసార్లు జగన్ తన కారులోనే ఎక్కించుకున్న సందర్భాలు ఉన్నాయి. సురేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పుడు జైలుకు వెళ్లి మరీ పరామర్శించి వచ్చారు జగన్.

Also Read : వంశీ కి ఊహించని షాక్ ఇచ్చిన హైకోర్టు

కానీ ఇప్పుడు మాత్రం సురేష్.. జగన్ వద్దకు వెళ్లడానికి ప్రయత్నం చేస్తున్నా సరే భద్రతా సిబ్బంది రానీయడం లేదు. కొడాలి నాని అలాగే వైవి సుబ్బారెడ్డి వంటి వాళ్లు మాత్రమే జగన్ వద్ద కనిపించారు. ఇక జగన్ కాన్వాయ్ లో వీళ్ళిద్దరితోపాటు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి కూడా ఉన్నారు. నందిగం సురేష్ కూడా కారు ఎక్కే ప్రయత్నం చేస్తుంటే భద్రత సిబ్బంది అతన్ని పక్కకు నెట్టేశారు. ఒకప్పుడు సురేష్ కు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన జగన్ కనీసం ఇప్పుడు దగ్గరకు కూడా రానీయకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

పార్లమెంట్ లో దుమ్మురేపిన...

సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంపు బిల్లు-2026...

తెలంగాణలో డయల్ 100కు...

తెలంగాణ రాష్ట్రంలో దశాబ్దాలుగా ప్రజల నాడిలో,...

జంతర్ మంతర్ నిరసనల్లో...

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్...

బీసీలకు ఏపీ సర్కార్...

ఆంధ్రప్రదేశ్‌లో వెనుకబడిన తరగతుల సామాజికవర్గాల భద్రత,...

కృష్ణా నదిని మింగేస్తున్నారా..?...

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలో కృష్ణానది...

మళ్లీ వైసీపీలోకి విజయసాయిరెడ్డి..?...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం...

పోల్స్