Sunday, June 21, 2026 05:06 AM
Sunday, June 21, 2026 05:06 AM

అమ్మో గాయాలు.. భారత్ కు షాక్ ల మీద షాక్ లు

ఇంగ్లాండ్ పర్యటనలో భారత్ కు కొత్త సమస్య వచ్చి పడింది. మొదటి టెస్ట్ ఓటమి తర్వాత రెండో టెస్ట్ లో ఘన విజయం సాధించిన భారత జట్టు.. మూడవ టెస్ట్ లో ఫెయిల్ అయింది. కీలకమైన నాలుగో టెస్ట్ లో గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ తరుణంలో గాయాలు జట్టు యాజమాన్యాన్ని కంగారు పెట్టేస్తున్నాయి. జట్టు ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి గాయపడ్డాడు. జిమ్ లో వ్యాయామం చేస్తున్న సమయంలో అతని కాలికి గాయం కావడంతో సీరీస్ నుంచి తప్పుకున్నాడు.

Also Read : పంత్ ఆడాలా..? వద్దా..? గిల్ ముందు పెద్ద సమస్యే..!

స్కానింగ్ లో లిగమెంట్ కట్ అయినట్టు గుర్తించారు. ఇక పేస్ బౌలర్ లు ఆకాష్ దీప్, అర్శదీప్ సింగ్ లు కూడా గాయపడ్డారు. దీనితో జట్టులోకి అన్షుల్ కాంబోజ్ ను చేర్చింది యాజమాన్యం. అతను ప్రాక్టీస్ మ్యాచుల్లో ఆకట్టుకున్నాడు. దీనితో తుది జట్టులో ఆడే అవకాశాలు కనపడుతున్నాయి. దీనితో ఇప్పుడు బౌలింగ్ విభాగం విషయంలో అనుమానాలు నెలకొన్నాయి. సిరాజ్, బూమ్రాకు తోడుగా ఎవరు ఆడతారు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

Also Read : ఆ రెండు పదవులిస్తే ఉంటా.. లేదంటే అంతే..!

అర్శదీప్ సింగ్ గాయం గురించి క్లారిటీ రాకపోవడంతో.. అతనిని ఆడిస్తారా లేదా అనేది స్పష్టత రావడం లేదు. ఆకాష్ దీప్ దాదాపుగా సీరీస్ నుంచి తప్పుకున్నట్టే కనపడుతోంది. దీనితో కాంబోజ్ ను తుది జట్టులోకి తీసుకోవచ్చు అంటున్నాయి భారత క్రికెట్ వర్గాలు. కీలకమైన రెండు మ్యాచులలో భారత్ సత్తా చాటాలి. అటు బ్యాటింగ్ విభాగం లో కూడా ఇప్పుడు అనేక ప్రశ్నలు ఉన్నాయి. పంత్ గాయపడటంతో అతను ఆడతాడా లేదా అనేది కూడా స్పష్టత రావడం లేదు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుపతిలో కేఎఫ్‌సీ, డొమినోస్‌...

ప్రముఖ అంతర్జాతీయ ఫుడ్ బ్రాండ్ల ఆహార...

తిరుపతిలో వడ్డీ మాఫియా.....

తిరుపతి నగరంలో వడ్డీ వ్యాపారం పేరుతో...

సాయికృష్ణ కేసులో వైసీపీ...

విజయవాడ రౌడీ షీటర్‌ గాదె సాయికృష్ణ...

బ్రేకింగ్: అల్లు అర్జున్‌...

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య...

తెలంగాణాలో జనసేన తొలి...

గత కొన్నాళ్ళుగా తెలంగాణాలో పార్టీ బలోపేతం...

బ్రేకింగ్: కొడాలి అరెస్ట్...

ఏపీలో వైసీపీ కీలక నేతలకు చట్టపరమైన...

పోల్స్