Tuesday, August 11, 2026 02:44 AM
Tuesday, August 11, 2026 02:44 AM

ఇండియన్స్ కు ఎక్స్ గుడ్ న్యూస్

భారత్ లో తమ మార్కెట్ ను విస్తరించుకునే ప్రయత్నాలు చేస్తున్న అమెరికా వ్యాపార దిగ్గజం ఎలాన్ మస్క్ తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X సబ్ స్క్రిప్షన్ ధరలను భారీగా తగ్గించారు మస్క్. ట్విట్టర్ ను కొనుగోలు చేసిన తర్వాత బ్లూ టిక్ కోసం కొంత రుసుము విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు మస్క్. తాజాగా ఆ సబ్‌స్క్రిప్షన్ ఫీజులను 48 శాతం వరకు ఎక్స్ తగ్గించిందని ప్రకటించారు. దీనితో భారత్ లో మరింత మందికి ఎక్స్ ను దగ్గర చేయాలని మస్క్ భావిస్తున్నారు.

Also Read : అమరావతి ల్యాండ్ పూలింగ్ కూటమి కి లాభమా.. నష్టమా?

మొబైల్ యాప్ ప్రీమియం ఖాతా సబ్‌స్క్రిప్షన్ ఫీజును దాదాపు 48 శాతం తగ్గించి, నెలవారీగా గతంలో వసూలు చేసిన రూ.900 నుండి రూ.470కి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఎక్స్ లో ప్రీమియం, ప్రీమియం-ప్లస్ సర్వీస్ సబ్‌స్క్రైబర్లకు ఐడీ పక్కన చెక్‌ మార్క్‌ ను ఇస్తుంది. అదేవిధంగా, ఎక్స్ వెబ్ ఎకౌంటు లకు ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ఫీజును దాదాపు 34 శాతం తగ్గించి, గతంలో ఉన్న రూ.650 నుండి రూ.427కి తగ్గించింది. యాప్ స్టోర్‌లు వసూలు చేసే అదనపు ఫీజుల కారణంగా మొబైల్ యాప్‌లలో ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ఛార్జీలు రూ.470 వరకు ఉన్నాయి.

Also Read : స్విచ్ లు మాన్యువల్ గా ఆపలేం.. అనలిస్ట్ సంచలన కామెంట్స్

బేసిక్ సబ్ స్క్రైబర్ లకు కూడా కూడా గుడ్ న్యూస్ చెప్పింది. నెలవారీ చార్జీలను 30 శాతం తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనితో గతంలో రూ.243.75గా ఉండే చార్జ్ ఇప్పుడు రూ.170కి తగ్గింది. బేసిక్ సబ్ స్క్రైబర్ లు పోస్ట్‌ లను ఎడిట్ చేయడానికి, లాంగ్ కంటెంట్ రాసేందుకు, ప్లే బ్యాక్, వీడియోలను డౌన్లోడ్ చేసుకునే ఫీచర్లు కల్పించింది. ఏడాది చార్జీలను కూడా తగ్గించింది. వార్షిక సభ్యత్వ రుసుము దాదాపు 34 శాతం తగ్గింది. తగ్గించిన తర్వాత రూ.1,700 చార్జ్ చేయనుంది. ఇప్పటి వరకు రూ.2,590.48 చార్జ్ చేసింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

మెట్రో రైల్ కూతకు...

ఏపీలో మెట్రో రైలు ప్రాజెక్టు పనులు...

దామచర్లపై బాలినేని మరోసారి...

ఒంగోలు రాజకీయం మరోసారి తీవ్ర రసవత్తరంగా...

విమర్శలకు చెక్ పెట్టడంలో...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా డీఎస్సీలో అవతల జరిగాయని...

ఏపి పోలీసుల పై...

ఏపీ పారిశ్రామికా శాఖ మంత్రి టి.జి....

స్థానిక పోరు.. రణమా.....

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వేడి...

ఒంగోలు పాలిటిక్స్‌లో కూటమి...

ఆంధ్రప్రదేశ్‌లో అధికార కూటమికి చెందిన ఇద్దరు...

పోల్స్