Wednesday, August 5, 2026 02:31 PM
Wednesday, August 5, 2026 02:31 PM

దావోస్ టూ సెక్రెటేరియట్.. బిజీ బిజీగా సిఎం..!

ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు బిజీ షెడ్యూల్ మరోసారి హాట్ టాపిక్ అయింది. పరిపాలనలో నిత్యం బిజీగా ఉండే సిఎం.. నాలుగు రోజుల పాటు దావోస్ లో బిజీ బిజీగా గడిపారు. పలువురు పారిశ్రామిక వేత్తలతో సమావేశమై రాష్ట్రానికి పెట్టుబడులను ఆహ్వానించారు సిఎం. ఇక అక్కడి నుంచి నిన్న సాయంత్రం బయల్దేరి వచ్చిన చంద్రబాబు.. నేడు బిజీ బిజీగా గడపనున్నారు. ఉదయం 8:25కు హైదరాబాద్‌కు చేరుకున్న సిఎం.. అక్కడి నుంచి నేరుగా గన్నవరం ప్రయాణం అయ్యారు.

Also Read : కేటిఆర్ విచారణ వెనుక కవిత.. బీఆర్ఎస్ సంచలన ఆరోపణ..!

ఇక 10:30కు గన్నవరం చేరుకుని..11:30కు సచివాలయానికి వెళ్ళారు సిఎం. అనంతరం వివిధ సమావేశాల్లో సిఎం పాల్గొంటారు. ముఖ్యంగా నేడు సుదీర్ఘంగా జరగనున్న రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో సిఎం పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో 5వ బ్లాక్ లో ఈ సమావేశం జరుగుతోంది. వచ్చీ రావడంతోనే నేరుగా ఎస్ఎల్బీసీకి ముఖ్యమంత్రి చంద్రబాబు రావడం గమనార్హం. వార్షిక రుణ ప్రణాళిక అమలుపై సమీక్ష సహా వివిధ అంశాలపై చర్చించనున్న ఈ సమావేశంలో చర్చిస్తారు.

Also Read : జనసేనాని స్పీడ్.. అరకులో ఇల్లు కడతారా..?

చిన్న తరహా పరిశ్రమలు, వ్యవసాయ రుణాలపై సమీక్షించనున్నారు సిఎం. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశానికి వివిధ బ్యాంకులకు చెందిన ప్రతినిధులు, జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ డైరెక్టర్లు హాజరు అయ్యారు. ఈ సమావేశానికి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కూడా హాజరు అయ్యారు. స్వయం సహాయక సంఘాలకు, చిన్న తరహా పరిశ్రమలకు రుణాలు ఇవ్వడంపై ఆలస్యం అవుతోన్న నేపధ్యంలో ఈ సమావేశం కీలకంగా మారింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

జంతర్ మంతర్ నిరసనల్లో...

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్...

బీసీలకు ఏపీ సర్కార్...

ఆంధ్రప్రదేశ్‌లో వెనుకబడిన తరగతుల సామాజికవర్గాల భద్రత,...

కృష్ణా నదిని మింగేస్తున్నారా..?...

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలో కృష్ణానది...

మళ్లీ వైసీపీలోకి విజయసాయిరెడ్డి..?...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం...

నవంబర్ వరకు నో...

తెలంగాణ స్థానిక సంస్థల పోరు కోసం...

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

పోల్స్