Sunday, June 21, 2026 02:01 PM
Sunday, June 21, 2026 02:01 PM

భూమనను అడిగిన ప్రశ్నలు ఇవే..?

గత కొన్నాళ్ళుగా పరకామణి చోరీ వ్యవహారం సంచలనం అవుతోన్న సంగతి తెలిసిందే. పరకామణి వ్యవహారంలో రాజకీయ నాయకుల ప్రమేయం ఉందనే వార్తల నేపధ్యంలో.. ఈ వ్యవహారాన్ని హైకోర్ట్ కూడా సీరియస్ గా తీసుకుని పూర్తి స్థాయిలో విచారణ జరపాలని ఆదేశించింది. ఈ నేపధ్యంలో టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిని పోలీసులు విచారించారు. ఈ అంశంలో ఆయనే కీలక వ్యక్తి అనే ఆరోపణల నేపధ్యంలో పోలీసులు నోటీసులు ఇవ్వగా నిన్న భూమన హాజరు అయ్యారు.

Also Read : ఆ జిల్లా సంగతి నేను చూస్తా.. చంద్రబాబు కీలక కామెంట్స్

ఈ సందర్భంగా డీజీ రవి శంకర్ అయ్యన్నార్ ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా ఈ కేసులో కీలక సాక్షిగా భావిస్తున్న సతీష్ కుమార్ మరణంపై కూడా ప్రశ్నల వర్షం కురిపించారు రవిశంకర్ అయ్యన్నార్. సతీష్‌ కుమార్‌ ది ఆత్మహత్యేనని మీడియాకు ఎలా చెప్పారు? అని నిలదీశారు. ఆత్మహత్య అనడానికి మీ వద్ద ఉన్న ఆధారాలు ఏంటి? అని ప్రశ్నించారు. పరకామణి చోరీ కేసు నిందితుడు రవికుమార్‌ ఆస్తులను శ్రీవారికి గిఫ్ట్ డీడ్‌ గా ఎందుకు తీసుకున్నారు అని ప్రశ్నల వర్షం కురిపించారు.

Also Read : బ్రేకింగ్: గోదావరి పుష్కరాల తేదీలు ఇవే.. చంద్రబాబు ఖాతాలో హ్యాట్రిక్ రికార్డ్..!

అప్పటికప్పుడు టేబుల్‌ ఎజెండాగా పెట్టడంలో మీ ఉద్దేశం ఏమిటి? ఎవరి ప్రమేయం ఉంది? అంటూ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. కేసులు రాజీ చేయాలని ఎవరి నుంచైనా ఒత్తిళ్లు వచ్చాయా?.. రాజీ అంశంలో పోలీసులకు మీరేమైనా సూచించారా? అని నిలదీసినట్లు సమాచారం. రవికుమార్‌ ఆస్తులను ఎవరైనా రాయించుకున్నట్లు అనుమానం ఉందా? రవికుమార్‌పై విజిలెన్స్‌ ద్వారా ఎలాంటి దర్యాప్తు చేయించారు అని ప్రశ్నించగా.. దీనిపై భూమన సమాధానాలు దాటవేసినట్టు తెలుస్తోంది. ఇక బయటకు వచ్చి వెటకారంగా భూమన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఒత్తిడి భరించలేని నిబద్దత కలిగిన పోలీసు అధికారులు నన్ను పిలిచారు అంటూ వెటకారంగా వ్యాఖ్యలు చేసారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

SBI వర్సెస్ తెలంగాణా...

రాయదుర్గం భూముల కేటాయింపు వ్యవహారంలో స్టేట్...

తిరుపతిలో కేఎఫ్‌సీ, డొమినోస్‌...

ప్రముఖ అంతర్జాతీయ ఫుడ్ బ్రాండ్ల ఆహార...

తిరుపతిలో వడ్డీ మాఫియా.....

తిరుపతి నగరంలో వడ్డీ వ్యాపారం పేరుతో...

సాయికృష్ణ కేసులో వైసీపీ...

విజయవాడ రౌడీ షీటర్‌ గాదె సాయికృష్ణ...

బ్రేకింగ్: అల్లు అర్జున్‌...

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య...

తెలంగాణాలో జనసేన తొలి...

గత కొన్నాళ్ళుగా తెలంగాణాలో పార్టీ బలోపేతం...

పోల్స్