Saturday, September 19, 2026 10:21 PM
Saturday, September 19, 2026 10:21 PM

భూమనను అడిగిన ప్రశ్నలు ఇవే..?

గత కొన్నాళ్ళుగా పరకామణి చోరీ వ్యవహారం సంచలనం అవుతోన్న సంగతి తెలిసిందే. పరకామణి వ్యవహారంలో రాజకీయ నాయకుల ప్రమేయం ఉందనే వార్తల నేపధ్యంలో.. ఈ వ్యవహారాన్ని హైకోర్ట్ కూడా సీరియస్ గా తీసుకుని పూర్తి స్థాయిలో విచారణ జరపాలని ఆదేశించింది. ఈ నేపధ్యంలో టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిని పోలీసులు విచారించారు. ఈ అంశంలో ఆయనే కీలక వ్యక్తి అనే ఆరోపణల నేపధ్యంలో పోలీసులు నోటీసులు ఇవ్వగా నిన్న భూమన హాజరు అయ్యారు.

Also Read : ఆ జిల్లా సంగతి నేను చూస్తా.. చంద్రబాబు కీలక కామెంట్స్

ఈ సందర్భంగా డీజీ రవి శంకర్ అయ్యన్నార్ ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా ఈ కేసులో కీలక సాక్షిగా భావిస్తున్న సతీష్ కుమార్ మరణంపై కూడా ప్రశ్నల వర్షం కురిపించారు రవిశంకర్ అయ్యన్నార్. సతీష్‌ కుమార్‌ ది ఆత్మహత్యేనని మీడియాకు ఎలా చెప్పారు? అని నిలదీశారు. ఆత్మహత్య అనడానికి మీ వద్ద ఉన్న ఆధారాలు ఏంటి? అని ప్రశ్నించారు. పరకామణి చోరీ కేసు నిందితుడు రవికుమార్‌ ఆస్తులను శ్రీవారికి గిఫ్ట్ డీడ్‌ గా ఎందుకు తీసుకున్నారు అని ప్రశ్నల వర్షం కురిపించారు.

Also Read : బ్రేకింగ్: గోదావరి పుష్కరాల తేదీలు ఇవే.. చంద్రబాబు ఖాతాలో హ్యాట్రిక్ రికార్డ్..!

అప్పటికప్పుడు టేబుల్‌ ఎజెండాగా పెట్టడంలో మీ ఉద్దేశం ఏమిటి? ఎవరి ప్రమేయం ఉంది? అంటూ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. కేసులు రాజీ చేయాలని ఎవరి నుంచైనా ఒత్తిళ్లు వచ్చాయా?.. రాజీ అంశంలో పోలీసులకు మీరేమైనా సూచించారా? అని నిలదీసినట్లు సమాచారం. రవికుమార్‌ ఆస్తులను ఎవరైనా రాయించుకున్నట్లు అనుమానం ఉందా? రవికుమార్‌పై విజిలెన్స్‌ ద్వారా ఎలాంటి దర్యాప్తు చేయించారు అని ప్రశ్నించగా.. దీనిపై భూమన సమాధానాలు దాటవేసినట్టు తెలుస్తోంది. ఇక బయటకు వచ్చి వెటకారంగా భూమన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఒత్తిడి భరించలేని నిబద్దత కలిగిన పోలీసు అధికారులు నన్ను పిలిచారు అంటూ వెటకారంగా వ్యాఖ్యలు చేసారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుమల లడ్డూ పై,...

ఈడీ అంటే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌.. ఈ...

ఇప్పటికీ వారికే పదవులు.....

కూటమి ప్రభుత్వం ఏర్పడి, దాదాపు రెండున్నర...

సాయిరెడ్డి.. నెట్టుకు రాగలరా.....

కొత్త ఎపుడూ వింతే. అందుకే కొత్తగా...

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

పోల్స్