2026-27 విద్యా సంవత్సరం నేపథ్యంలో కూటమి ప్రభుత్వం విద్యార్థులకు, తల్లిదండ్రులకు అదిరిపోయే తీపి కబురు అందించింది. జూన్ 19వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పండుగ వాతావరణం నెలకొనబోతోంది. ఈ మేరకు విద్యాశాఖ కీలక కార్యాచరణను ప్రకటించింది. జూన్ 19న రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతిష్టాత్మకమైన మెగా పేరెంట్-టీచర్ మీట్ నిర్వహించనున్నట్లు విద్యాశాఖ అధికారికంగా వెల్లడించింది.
Also Read : బ్రేకింగ్: ఏపీకి కేంద్ర మంత్రి క్రేజీ గుడ్ న్యూస్..!
ఈ సమావేశం ద్వారా ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల మధ్య సమన్వయం పెంచి, విద్యార్థుల విద్యాపరమైన పురోగతిపై లోతుగా చర్చించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇది కేవలం సాధారణ సమావేశానికే పరిమితం కాకుండా, అదే రోజున విద్యార్థులకు, వారి తల్లులకు భారీ ఊరటనిచ్చే కార్యక్రమాలను ప్రభుత్వం ప్లాన్ చేసింది. ప్రభుత్వ పాఠశాలల పట్ల తల్లిదండ్రులకు నమ్మకాన్ని కలిగించడంతో పాటు, విద్యార్థుల అభివృద్ధిలో తల్లిదండ్రులను భాగస్వాములను చేయడమే ఈ మెగా మీట్ ప్రధాన ఉద్దేశ్యం.
ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలోనే పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు ఏపీ సర్కారు సిద్ధమైంది. జూన్ 19న జరిగే మెగా మీట్ తో పాటే ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తల్లికి వందనం పథకం కింద అర్హులైన తల్లుల బ్యాంకు అకౌంట్లలో నేరుగా డబ్బులను జమ చేయనున్నారు. గతంలో నిర్ణయించిన విధంగా ప్రతి విద్యార్థి చదువు కోసం ఏటా రూ.15,000 అందించాల్సి ఉండగా, ఆ డబ్బులోనే కొంత మొత్తాన్ని బడుల అభివృద్ధి మరియు మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం కేటాయిస్తోంది.
Also Read : మారిన వీసా నిబంధనలు.. భారతయ విద్యార్థులు జాగ్రత్త పడాల్సిందే..!
ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకూ చదివే విద్యార్థులకు ప్రభుత్వం ఈ ఆర్థిక సాయాన్ని అందజేస్తోంది. జూన్ 19న నిర్వహించనున్న ఈ రెండు భారీ కార్యక్రమాల కోసం విద్యాశాఖ ఇప్పటికే జిల్లాల వారీగా ఆదేశాలు జారీ చేసింది. పాఠశాలలను సుందరంగా అలంకరించడంతో పాటు, వచ్చిన తల్లిదండ్రులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం సూచించింది. ఒకే రోజున అటు పిల్లల చదువుపై చర్చ, ఇటు తల్లుల ఖాతాల్లో నగదు జమ కానుండటంతో జూన్ 19న ఏపీలో విద్యా పండుగ వాతావరణం కనిపించనుంది.

