Wednesday, May 6, 2026 10:02 PM
Wednesday, May 6, 2026 10:02 PM

అమిత్ షా, జేపీ నడ్డా ఫోన్ లు కూడా..?

తెలంగాణా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో అర్ధం కాక.. రాజకీయ వర్గాలు సైతం ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఈ వ్యవహారంలో బిజెపి నేతలు కూడా ఇబ్బంది పడ్డారనే విషయాన్ని తెలుసుకున్న కేంద్ర పెద్దలు, అవసరమైతే సిబిఐ విచారణకు ఆదేశించే అవకాశం ఉందనే ప్రచారం సైతం జరిగింది. ఈ తరుణంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ విచారణకు హాజరు అయ్యారు. ఈ విచారణలో బండి సంజయ్ ఆశ్చర్యపోయే నెంబర్ లు అధికారులు ముందుపెట్టినట్టు వార్తలు వస్తున్నాయి.

Also Read : ఖబడ్డార్ కేటీఆర్.. తడాఖా చూపిస్తాం.. కమ్మ సంఘాల హెచ్చరిక

సిట్ అధికారులు.. కొన్ని ఫోన్ నెంబర్ లు పెట్టగా అందులో ప్రముఖులు ఉన్నారట. సంజయ్ తెలంగాణా బిజెపి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో.. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బి.ఎల్‌.సంతోష్‌ తో పలుమార్లు ఫోన్ లో మాట్లాడేవారు. ఆ ముగ్గురు నేతల ఫోన్ నెంబర్ లను సిట్ అధికారులు బండి సంజయ్ ముందుపెట్టారు. ఆ నంబర్ లు ఎవరివి అని అడగడంతో బండి సంజయ్ చూసి షాక్ అయ్యారు. ఎవరివో చెప్పగా అధికారులు కూడా కంగుతిన్నారు.

Also Read : ఓటర్ బాంబు పేల్చిన రాహుల్.. సంచలన లెక్కలు రిలీజ్

అవి అమిత్ షా, జెపి నడ్డా, సంతోష్ నెంబర్ లు అని చెప్పినట్టు సమాచారం. ఇదే సమయంలో పార్టీకి విరాళాలు ఇచ్చిన వారి నెంబర్ లు కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. వారి ఫోన్ లను సైతం ట్యాప్ చేసారని.. ఫోన్‌ ట్యాపింగ్‌లో కీలకపాత్ర పోషించిన ప్రణీత్‌రావుకు ఒక కోడ్‌ ఇచ్చారని.. దాంతో ఆయన రోజూ సంజయ్‌తోపాటు వ్యక్తిగత సిబ్బంది ఫోన్‌లు ట్యాపింగ్‌ చేసి, ముఖ్యమైన సమాచారాన్ని నాటి ప్రభుత్వ పెద్దలకు తెలిపేవారని సిట్ అధికారులు బండి సంజయ్ కు వివరించగా కేంద్ర మంత్రి కంగుతిన్నారు. 2022 ఆగస్టు నుంచి 2023 మే చివరి వరకూ సీడీఆర్‌ను వారి ముందు ఉంచి వారిని ప్రశ్నించినట్టు తెలుస్తోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

లోకేష్ సంచలన నిర్ణయం,...

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో భారీ మార్పులకు శ్రీకారం...

ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పై...

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన...

ఏపీకి మరో దిగ్గజ...

ఏపీకి అంతర్జాతీయ పరిశ్రమలు క్యూ కడుతున్నాయి....

ఇన్ అండ్ అవుట్.....

తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండున్నరేళ్లు...

ఏపీ ఐపీఎస్ ను...

ఆంధ్రప్రదేశ్‌ లో సంచలనం సృష్టించిన సినీ...

విజయ్ చుట్టూ ఏపీ..వైసీపీ...

తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ...

పోల్స్