Wednesday, May 6, 2026 10:06 PM
Wednesday, May 6, 2026 10:06 PM

ఆగ్రో ఉగ్రవాదం.. అమెరికాను షేక్ చేసిన చైనా.. కంగారులో భారత్

కాలం మారుతున్న కొద్దీ సాంకేతిక పరిజ్ఞానం కొత్త రూపు సంతరించుకున్నట్టు.. ఉగ్రవాదం కూడా రోజు రోజుకి తన రూపాన్ని మార్చుకుంటుంది. తుపాకులు, బాంబులు, రాకెట్ లాంచర్ల నుంచి బయో వార్.. ఇప్పుడు ఆగ్రో వార్ దిశగా అడుగులు పడుతున్నాయి. దీనికి చైనా శ్రీకారం చుడుతోంది. తాజాగా అమెరికా విషయంలో చైనా.. ఆగ్రో ఉగ్రవాదానికి శ్రీకారం చుట్టింది. తాజాగా చైనాకు చెందిన ఇద్దరు వ్యక్తులను అధికారులు అదుపులోకి తీసుకోవడం సంచలనంగా మారింది.

Also Read : తెనాలి పర్యటన వెనుక ఇంత కుట్ర ఉందా..?

అమెరికాలో వ్యవసాయ రంగాన్ని దెబ్బ తీసేందుకు చైనా చేసిన కుట్రగా భావిస్తున్నారు. అక్కడి పంటలలో తల ముడతను కలిగించే వైరస్ ను పంపించేందుకు చైనా కుట్ర చేసినట్టుగా భావిస్తున్నారు. చైనా పౌరుడు జున్యోంగ్ లియు.. అమెరికాలో ఉంటున్న తన ప్రియురాలును కలిసేందుకు గత ఏడాది జులైలో వెళ్ళాడు. ఆ సమయంలో అతని వద్ద కొన్ని అనుమానాస్పద వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. అక్కడి నుంచి అతనిని అదుపులోకి తీసుకుని విచారించగా ఫంగస్‌ ను అక్రమ రవాణా చేసినట్లు ఒప్పుకున్నాడు.

Also Read : మతం కార్డు.. మలేషియాలో పాక్ డ్రామాలు

తన స్నేహితురాలు పనిచేసే మిచిగాన్ విశ్వవిద్యాలయ ప్రయోగశాలలో దానిపై పరిశోధన చేయడానికి తాను అలా చేశానని అతను చెప్పడం గమనార్హం. దీనిపై అమెరికా అధికారులు ఆందోళన వ్యక్తం చేసారు. అమెరికాలో ఆహార కొరత సృష్టించేందుకు ఈ విధంగా ప్రయత్నం చేస్తున్నట్టు భావిస్తున్నారు. ఈ తరహా వైరస్ లను క్రీస్తుపూర్వం 660లో మొదటిసారి ఉపయోగించారని గుర్తించారు. దీనిపై భారత్ కూడా ఆందోళన వ్యక్తం చేస్తోంది. పాకిస్తాన్ తో చైనాకు ఉన్న స్నేహం నేపధ్యంలో పంజాబ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ వంటి కీలకమైన వ్యవసాయ రాష్ట్రాలు పాకిస్తాన్, చైనా సరిహద్దుల్లో ఉండటంతో ఈ తరహా దాడులకు దిగే అవకాశం ఉందనే ఆందోళన మొదలైంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

లోకేష్ సంచలన నిర్ణయం,...

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో భారీ మార్పులకు శ్రీకారం...

ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పై...

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన...

ఏపీకి మరో దిగ్గజ...

ఏపీకి అంతర్జాతీయ పరిశ్రమలు క్యూ కడుతున్నాయి....

ఇన్ అండ్ అవుట్.....

తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండున్నరేళ్లు...

ఏపీ ఐపీఎస్ ను...

ఆంధ్రప్రదేశ్‌ లో సంచలనం సృష్టించిన సినీ...

విజయ్ చుట్టూ ఏపీ..వైసీపీ...

తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ...

పోల్స్