Wednesday, February 4, 2026 07:48 PM
Wednesday, February 4, 2026 07:48 PM

మోక్షజ్ఞ ఎంట్రీ మళ్ళీ వాయిదా…?

నందమూరి వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు దాదాపుగా ఐదారేళ్ళ నుంచి గట్టిగానే ఎదురుచూస్తున్నారు. బాలకృష్ణకు కథలు నచ్చకపోవడం అలాగే మోక్షజ్ఞ కూడా సినిమాల కోసం రెడీగా లేకపోవడంతో మోక్షజ్ఞ ఎంట్రీ వాయిదా పడుతూ వస్తోంది. ఒక పక్కన స్టార్ హీరోల వారసులందరూ సినిమాల్లో రాణిస్తుంటే నందమూరి మోక్షజ్ఞ మాత్రం సినిమాలకు దూరంగా ఉండాలనుకుంటున్నాడు అనే ప్రచారం కూడా నందమూరి అభిమానులను కాస్త ఇబ్బంది పెట్టింది. ఎట్టకేలకు యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో నందమూరి మోక్షజ్ఞ ఒక సినిమాను మొదలుపెట్టాడు.

Also Read : అలా ఎలా అవకాశం ఇస్తారు సర్..!

బాలకృష్ణకు ఆ కథ నచ్చటం అలాగే ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమాతో మంచి హిట్ కొట్టడంతో నమ్మకంతో ఆ సినిమాను లాంచ్ చేశారు. దానికి సంబంధించిన లుక్స్ కూడా రీసెంట్ గా బయటకు వచ్చాయి. అయితే డిసెంబర్ 5 నుంచి ఈ సినిమా మొదలవుతుందని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ సినిమా మాత్రం ఇంకా మొదలు కాకపోవడంతో నందమూరి అభిమానులు ఆందోళనలో ఉన్నారు. అయితే ఇప్పుడు వస్తున్న వార్తలు ప్రకారం ఆ సినిమా క్యాన్సిల్ అయింది అనే ప్రచారం జరుగుతుంది.

Also Read : క్లోజ్ ఫ్రెండ్స్ ను నిండా ముంచిన కొడాలి

దాని వెనుక కారణం ఏంటి అనేది తెలియకపోయినా కథలో కొన్ని మార్పులు బాలకృష్ణ చెప్పారని అది ప్రశాంత్ వర్మకు నచ్చలేదని కొంతమంది అంటున్నారు. అయితే ప్రశాంత్ వర్మ… ప్రభాస్ సినిమా కోసం ఈ సినిమాను వాయిదా వేశాడని ఇదే సమయంలో ఆదిత్య 999 సినిమాను బాలకృష్ణ మోక్షజ్ఞతో చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు బాలకృష్ణ దర్శకత్వం వహించడమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. అందుకే ప్రశాంత్ వర్మ సినిమాను వాయిదా వేసినట్టుగా ప్రచారం జరుగుతుంది. గతంలో ప్రశాంత్ వర్మ రణవీర్ సింగ్ తో ఒక సినిమా మొదలుపెట్టి అది వాయిదా వేసే ఇప్పుడు ఆ కథను ప్రభాస్ తో చేయడానికి రెడీ అయ్యాడు. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై ఈ సినిమాను ప్రశాంత్ వర్మ ప్రభాస్ తో చేస్తున్నాడు. 2027 చివర్లో లేదా 2028లో ఆ సినిమా విడుదలయ్యే చాన్స్ ఉందనే టాక్ కూడా ఉంది. మరి మోక్షజ్ఞ సంగతి ఏంటి అనేదానిపై క్లారిటీ లేదు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

గుంటూరు కారమా.. మజాకానా…!

గుంటూరు కారం పవర్ ఇన్నాళ్లకు కన్పించింది.....

బాబు-పవన్ భేటీ.. ఆ...

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...

చంద్రబాబు సలహదారుగా మళ్లీ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్...

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

పోల్స్