Sunday, June 21, 2026 02:14 AM
Sunday, June 21, 2026 02:14 AM

ఏమిటీ మురుగు.. శంకరా…!

గంగ తరువాత అంత పవిత్రమైనది యమునా నది. గంగలో మునిగితే లభించే పుణ్యం.. యమునలో మునకేసినా లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అయితే ఇప్పుడు పొరపాటున మునకేస్తే.. పుణ్యం మాట తర్వాత… కావాల్సినన్ని జబ్బులు మాత్రం ఖాయం. రోగాల బారిన పడే అవకాశం ఉంది. నదీ జలాలు కాలుష్యంతో యమునా పరీవాహక ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యమున కాలుష్యం ఇప్పుడు ఢిల్లీలో తాగునీటి ఎద్దడికి కూడా కారణమవుతోంది..

Also Read : పాపం… ఆయన మాట లెక్కచేయని సీనియర్లు…!

యమునా నదిలోని ప్రమాదకరమైన విషపు నురగలు.. గడ్డ కట్టిన మంచు ఫలకాలుగా కనిపిస్తున్నాయి. పరిశ్రమల నుంచి విడుదలైన వ్యర్థాలు నదిలో కలుస్తుండడంతో విషపు నురగలు తేలియాడుతున్నాయి. 90 శాతం వ్యర్థ జలాలు, 58 శాతం వ్యర్థాలు యమునా నదిలో కలుస్తున్నాయి. శుద్ధి చేయని మురుగు నీటిని కూడా యమునలోకే వదులుతున్నారు. మురుగు నీటిలో పాస్ఫేట్‌, ఆమ్లం ఉంటాయి. ఇవి విషపూరిత నురుగుగా ఏర్పడవుతున్నాయి. ఈ కారణంగానే కొన్ని రోజులుగా యమునా నదిలో భారీగా నురగలు వస్తున్నాయి.

Also Read : వారిద్దరి కష్టం… బూడిదలో పోసిన పన్నీరేనా..?

కార్తీక మాసం సందర్భంగా గంగ, యమునా నదుల్లో పుణ్యస్నానాలను ఆచరించి.. సూర్య భగవానుడికి పూజలు నిర్వహిస్తారు. ఈ క్రమంలో ఢిల్లీలోని కాలిందీ కుంజ్‌ ప్రాంతంలో భక్తులకు మరో మార్గంలేక.. విషపూరితమైన జలాల్లోనే పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. యమునలో వస్తున్న నురగలను పక్కకు తోసి కొందరు స్నానాలు చేస్తుండగా.. అవి విషపూరితమని తెలియక.. చిన్నారులు ఆ నురగలతోనే ఆడుకుంటున్నారు. యమునలో మునకేస్తే పుణ్యం దేవుడెరుగు.. రోగాల బారిన పడుతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. యమున విషపూరితమని తెలుసని.. అయినా మరోమార్గం లేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుపతిలో కేఎఫ్‌సీ, డొమినోస్‌...

ప్రముఖ అంతర్జాతీయ ఫుడ్ బ్రాండ్ల ఆహార...

తిరుపతిలో వడ్డీ మాఫియా.....

తిరుపతి నగరంలో వడ్డీ వ్యాపారం పేరుతో...

సాయికృష్ణ కేసులో వైసీపీ...

విజయవాడ రౌడీ షీటర్‌ గాదె సాయికృష్ణ...

బ్రేకింగ్: అల్లు అర్జున్‌...

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య...

తెలంగాణాలో జనసేన తొలి...

గత కొన్నాళ్ళుగా తెలంగాణాలో పార్టీ బలోపేతం...

బ్రేకింగ్: కొడాలి అరెస్ట్...

ఏపీలో వైసీపీ కీలక నేతలకు చట్టపరమైన...

పోల్స్