Thursday, May 7, 2026 04:22 AM
Thursday, May 7, 2026 04:22 AM

ప్రకాశం బ్యారేజీ వద్ద మూడో బోటును వెలికితీసిన అధికారులు

ఎట్టకేలకు ప్రకాశం బ్యారేజీ వద్ద మూడో బోటును ఇంజనీర్లు తొలగించారు. గేట్ల వద్ద అడ్డుగా ఉన్న మూడు పడవలను ఇంజినీర్లు, అధికారులు శతవిధాలుగా ప్రయత్నించి వెలికి తీశారు. ప్రకాశం బ్యారేజీ వద్ద మూడో బోటును అధికారులు వెలికితీశారు. విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద అడ్డుపడి మునిగిన మూడో పడవను అధికారులు ఎట్టకేలకు తొలగించారు. ఇనుప గడ్డర్లతో 2 పడవలను అనుసంధానించి బోటును వెలికితీశారు. చైన్‌ పుల్లర్లతో ఎత్తి బ్యారేజీ ఎగువకు తరలించారు. 40 టన్నుల బరువున్న ఈ పడవ బ్యారేజీ 69వ గేటు వద్ద ఢీకొని అడ్డుగా మారింది. దీన్ని ప్రస్తుతం ఇంజినీర్లు పున్నమి ఘాట్‌ వద్దకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.

Read Also : ఏపీ టూ యూపీ… జగన్ కు బిగుస్తున్న ఉచ్చు

ఈనెల 1న భారీ ప్రవాహానికి ఎగువ నుంచి కొట్టుకువచ్చిన 5 బోట్లు బ్యారేజీ గేట్లను బలంగా ఢీకొట్టాయి. దీంతో 67, 69, 70 గేట్ల వద్ద కౌంటర్ వెయిట్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ప్రవాహంలో ఒక పడవ దిగువకు కొట్టుకు పోగా, మరో 3 భారీ బోట్లు, ఒక మోస్తరు పడవ గేట్ల వద్ద చిక్కుకున్నాయి. ఇవి బ్యారేజీ గేట్లకు అడ్డుపడి ప్రవాహాన్ని అడ్డుకుంటున్నాయి. దీంతో ఈ పడవలను తొలగించేందుకు పలు ప్లాన్​ అమలు చేసిన అధికారులు విఫలం అయ్యారు. దాదాపు 19 రోజుల ప్రయత్నాల అనంతరం రెండు పడవలను బయటకు తీశారు. తాజాగా ఇవాళ మూడో బోటును వెలికితీసి సఫలీకృతమయ్యారు. మరోవైపు నాలుగో పడవ కూడా ఉన్నట్టు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

లోకేష్ సంచలన నిర్ణయం,...

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో భారీ మార్పులకు శ్రీకారం...

ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పై...

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన...

ఏపీకి మరో దిగ్గజ...

ఏపీకి అంతర్జాతీయ పరిశ్రమలు క్యూ కడుతున్నాయి....

ఇన్ అండ్ అవుట్.....

తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండున్నరేళ్లు...

ఏపీ ఐపీఎస్ ను...

ఆంధ్రప్రదేశ్‌ లో సంచలనం సృష్టించిన సినీ...

విజయ్ చుట్టూ ఏపీ..వైసీపీ...

తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ...

పోల్స్