Wednesday, August 5, 2026 06:38 AM
Wednesday, August 5, 2026 06:38 AM

ఆచరణలోకి వచ్చిన లోకేష్ సంచలన హామీ

ఏపీలో నారా లోకేష్ దూకుడు కొనసాగుతుంది. మాజీ సైనికుల సంక్షేమానికి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తన్న హామీని అమలులోకి రావడంతో పార్టీ క్యాడర్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. లోకేష్ హామీ ఇస్తే తప్పక నెరవేరుతుంది అన్న నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. యువగళంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంపై మంత్రి నారా లోకేష్, సీఎం చంద్రబాబులకు మాజీ సైనికోద్యోగులు కృతజ్ఞతలు తెలిపారు.

Read Also : వైసీపీకి బాలినేని రాజీనామా వెనుక వైవీ సుబ్బారెడ్డి

అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే హామీని అమలు చేయడం పట్ల లక్షా 10వేల మాజీ సైనిక కుటుంబాల తరఫున కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపుతూ.. టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. మాజీ సైనికుల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో.. కూటమి నేతలు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తారంటూ అందులో ఎటువంటి సందేహం లేదన్నారు. జీవోనెంబర్ 57, 191 లను కూడా ప్రభుత్వం అమలు చేసి తమకు మేలు చేయాలన్నారు. జీవో నెంబర్ 357 ప్రకారం ప్రభుత్వం నియమించే నియామకాల్లో 2% ఉద్యోగాలను మాజీ సైనికులకు కేటాయించినా దాన్ని అమలు చేయలేదని.. దాన్ని కూడా అమలు చేయాలన్నారు.

గత ప్రభుత్వంలో మాజీ సైనికుల సమస్యలను అసలు పట్టించుకోలేదన్నారు. మాజీ సైనికులకు హక్కుగా వస్తున్న జాబులను తమకు అందేలా చూడాలన్నారు. గ్రూప్ 1 గ్రూప్ 2లలో 2% రిజర్వేషన్ ను 5 శాతంకు, గ్రూప్ 3, గ్రూప్ 4 లలో 10% శాతంకు పెంచాలని వారు అభ్యర్థించారు. మాజీ సైనికులందరిని ఓసీలుగా పరిగనిస్తున్నారని.. అన్ని కులాల వారు అందులో ఉన్నా oc లుగా పరిగనించడంతో మాజీ సైనికులకు దక్కాల్సిన ఉద్యోగాలు దక్కడంలేదన్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం...

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా...

జగన్ పర్యటన దెబ్బ.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

బ్రేకింగ్: విజయ్ పై...

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠగా...

దమ్ముంటే పట్టుకోండి చూద్దాం.....

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలో ఉందో.....

మళ్లీ మొదలైన కావేరీ...

దక్షిణ భారతదేశంలో దశాబ్దాలుగా నలుగుతున్న కావేరీ...

పోల్స్