Sunday, June 21, 2026 01:23 AM
Sunday, June 21, 2026 01:23 AM

అమరావతి పై దుష్ప్రచారానికి చేతులు కలిపిన వైసీపీ, బిఆర్ఎస్

ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి విషయంలో ఇప్పుడు మళ్ళీ తప్పుడు ప్రచారం మొదలయింది. వైసీపీ నేతలు, కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా అమరావతి విషయంలో తప్పుడు ప్రచారానికి దిగడం ఆందోళన కలిగిస్తున్నది. విజయవాడ దాదాపు నాలుగు రోజుల నుంచి వరద ముంపులో ఉంది. సింగ్ నగర్, పాయకాపురం, భవానిపురం సహా పలు ప్రాంతాలు నీట మునిగాయి. ప్రజలను వరద నుంచి సురక్షిత ప్రాంతానికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వ యంత్రాంగం తీవ్ర స్థాయిలో కష్టపడుతున్నది. కొందరు అధికారులు ఇంకా మొద్దు నిద్ర వీడకపోయినా, ఉన్న వనరులతో ఇప్పటివరకు ఒక్క ప్రాణం పోకుండా కాపాడుకుంటూ వస్తున్నారు.

ఇప్పటికే వేలాది మందిని వరద ప్రాంతం నుంచి సురక్షితంగా తీసుకొచ్చారు. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరద ముంపు ప్రాంతంలో ఉండి ఎప్పటికప్పుడు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. అయితే వైసీపీ సోషల్ మీడియా తో పాటుగా తమకు ఏ సంబంధం లేని బీఆర్ఎస్ సోషల్ మీడియా సైతం సోషల్ మీడియాలో వరద సహాయక చర్యల పై తప్పుడు ప్రచారానికి దిగింది. అమరావతి ఎక్కడ ఉంటుందో తెలియని వాళ్ళు… విజయవాడ ఫోటోలు పోస్ట్ చేసి అమరావతి మునిగింది అంటూ ప్రచారం చేయడం మొదలుపెట్టారు.

Read Also : వరద సహాయ కార్యక్రమాల్లో సీఎం రేవంత్ దూకుడు

ఈ వరద మానవులు సృష్టించింది అంటూ మాజీ సీఎం జగన్ నిస్సిగ్గుగా తప్పుడు ప్రకటనలు ఇవ్వటం ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసింది. విజయవాడ లో ముంపుకు గురైన ప్రాంతానికి, రాజధాని ప్రాంతానికి కనీసం 30 కిలోమీటర్ల దూరం ఉంటుంది. సరే అసలు రాజధాని ప్రాంతాల్లో వరదలు వచ్చాయి అనుకుందాం… చెన్నై, ముంబై, బెంగళూరు, ఢిల్లీ వరదలతో మునిగిన సందర్భాలు లేవా. ప్రతీ ఏటా హైదరాబాద్ లో వరదలు రావా…? హైదరాబాద్ లో వరదలు రావడం బీఆర్ఎస్ వాళ్లకు కనపడటం లేదా అనే ప్రశ్న వినపడుతోంది.

ఒక్కసారి కూడా ఆంధ్రప్రదేశ్ లో అడుగుపెట్టని వాళ్ళు సైతం అమరావతిలో వరదలు వచ్చాయని ప్రచారం చేయడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చేతనైతే సహాయం చేయాలి గాని తప్పుడు ప్రచారం చేయడం సమంజసం కాదంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ సోషల్ మీడియాకి, బిఆర్ఎస్ సోషల్ మీడియా కూడా అనుబంధంగా పనిచేయడమే వారి ఆక్రోశానికి అద్దం పడుతుంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుపతిలో కేఎఫ్‌సీ, డొమినోస్‌...

ప్రముఖ అంతర్జాతీయ ఫుడ్ బ్రాండ్ల ఆహార...

తిరుపతిలో వడ్డీ మాఫియా.....

తిరుపతి నగరంలో వడ్డీ వ్యాపారం పేరుతో...

సాయికృష్ణ కేసులో వైసీపీ...

విజయవాడ రౌడీ షీటర్‌ గాదె సాయికృష్ణ...

బ్రేకింగ్: అల్లు అర్జున్‌...

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య...

తెలంగాణాలో జనసేన తొలి...

గత కొన్నాళ్ళుగా తెలంగాణాలో పార్టీ బలోపేతం...

బ్రేకింగ్: కొడాలి అరెస్ట్...

ఏపీలో వైసీపీ కీలక నేతలకు చట్టపరమైన...

పోల్స్