Tuesday, March 24, 2026 08:03 PM
Tuesday, March 24, 2026 08:03 PM

ప్రజలు ఛీ కొట్టాక విలువలు గుర్తొచ్చాయా జగన్ రెడ్డీ?

ప్రతిపక్ష హోదా కూడా రాని స్థాయి ఓటమిని ప్రజలు కట్టబెట్టినా జగన్మోహన్ రెడ్డికి సిగ్గు రావడం లేదు. నైతిక విలువలు, విశ్వసనీయత అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఇంకా మీరే ముఖ్యమంత్రిననే భ్రమల్లో ఉంటే ఎలా పులివెందుల ఎమ్మెల్యే గారూ? అంటూ మంత్రి అచ్చన్నాయుడు మాజీ సీఎం జగన్ పై విరుచుకుపడ్డారు. ఇకనైనా భ్రమలు వీడి వాస్తవంలోకి వస్తే.. ప్రజా ప్రభుత్వ పాలన ఎలా ఉందో తెలుస్తుంది. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థిని పోటీనే పెట్టకూడదనడానికి మీరెవరు? మీకు ఆ అధికారం ఎవరిచ్చారు? అంటూ సూటిగా ప్రశ్నించారు.

గతంలో రాజభవన్ కి వెళ్లి ఫిర్యాదు చేసినప్పుడు, 20 మంది టీడీపీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. నేను తలుచుకుంటే టీడీపీ ప్రభుత్వం కూలిపోతుందని ప్రకటనలు చేసినప్పుడు విలువలు గుర్తుకురాలేదా? విలువల గురించి మాట్లాడే ముందు గడిచిన ఐదేళ్లలో రాష్ట్రాన్ని లూఠీ చేసిన విధానం, అక్రమాస్తుల కేసులో సీబీఐ వేసిన 11 చార్జ్ షీట్ల గురించి ప్రజలకు చెప్పే దమ్ముందా? అంటూ ఎద్దేవా చేశారు. మీ శవ రాజకీయాలకు, వికృత రాజకీయ క్రీడలకు, విష సంస్క్రతికి కాలం చెల్లింది. మేం తలుచుకుంటే వైసీపీ ఖాళీ అయిపోతుంది అని మంత్రి జగన్ ని హెచ్చరించారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

బ్రేకింగ్: డేంజర్ జోన్...

ఏపీలోని బెజవాడ నగరం వేదికగా సాగుతున్న...

బ్రేకింగ్: మాట నిలబెట్టుకున్న...

గత కొన్ని రోజులుగా విమర్శలు ఎదుర్కొంటున్న.....

ఏపీపై రైల్వే శాఖ...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిలోకి...

బాబోయ్.. బెజవాడలో ఉగ్రవాదులు..!

విజయవాడ వాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. విజయవాడలో...

బ్రేకింగ్: ఐటీ రంగంపై...

అమెరికా, ఇజ్రాయిల్ వర్సెస్ ఇరాన్ యుద్ధం...

దానంపైనే బీఆర్ఎస్ గురి..?...

2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత.....

పోల్స్