Saturday, September 13, 2025 12:33 PM
Saturday, September 13, 2025 12:33 PM
roots

ప్రజలు ఛీ కొట్టాక విలువలు గుర్తొచ్చాయా జగన్ రెడ్డీ?

ప్రతిపక్ష హోదా కూడా రాని స్థాయి ఓటమిని ప్రజలు కట్టబెట్టినా జగన్మోహన్ రెడ్డికి సిగ్గు రావడం లేదు. నైతిక విలువలు, విశ్వసనీయత అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఇంకా మీరే ముఖ్యమంత్రిననే భ్రమల్లో ఉంటే ఎలా పులివెందుల ఎమ్మెల్యే గారూ? అంటూ మంత్రి అచ్చన్నాయుడు మాజీ సీఎం జగన్ పై విరుచుకుపడ్డారు. ఇకనైనా భ్రమలు వీడి వాస్తవంలోకి వస్తే.. ప్రజా ప్రభుత్వ పాలన ఎలా ఉందో తెలుస్తుంది. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థిని పోటీనే పెట్టకూడదనడానికి మీరెవరు? మీకు ఆ అధికారం ఎవరిచ్చారు? అంటూ సూటిగా ప్రశ్నించారు.

గతంలో రాజభవన్ కి వెళ్లి ఫిర్యాదు చేసినప్పుడు, 20 మంది టీడీపీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. నేను తలుచుకుంటే టీడీపీ ప్రభుత్వం కూలిపోతుందని ప్రకటనలు చేసినప్పుడు విలువలు గుర్తుకురాలేదా? విలువల గురించి మాట్లాడే ముందు గడిచిన ఐదేళ్లలో రాష్ట్రాన్ని లూఠీ చేసిన విధానం, అక్రమాస్తుల కేసులో సీబీఐ వేసిన 11 చార్జ్ షీట్ల గురించి ప్రజలకు చెప్పే దమ్ముందా? అంటూ ఎద్దేవా చేశారు. మీ శవ రాజకీయాలకు, వికృత రాజకీయ క్రీడలకు, విష సంస్క్రతికి కాలం చెల్లింది. మేం తలుచుకుంటే వైసీపీ ఖాళీ అయిపోతుంది అని మంత్రి జగన్ ని హెచ్చరించారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జగన్ పరువును వారే...

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అంటే.....

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

పోల్స్