నీట్ పరీక్షల పేపర్ లీకేజీ వ్యవహారానికి వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దేశవ్యాప్త విద్యార్థుల ఆందోళనలు ఉధృతంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజిత్ దీప్కే నిరసనల సరళిపై అత్యంత కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యార్థులు శాంతియుతంగా చేస్తోన్న ఈ న్యాయమైన ఆందోళనలను కొందరు బయటి వ్యక్తులు కావాలనే చొరబడి తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన తీవ్రంగా ఆరోపించారు. భారతీయ జనతా పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగానే తమ నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని అభిజిత్ దీప్కే ఆరోపించారు.
Also Read : రా ఎన్టీఆర్ వివాదం.. సేవ వెనుక అసలు కథేంటి..?
జంతర్ మంతర్ వేదికగా జరుగుతోన్న విద్యార్థుల నిరసనల్లో అకస్మాత్తుగా చోటుచేసుకుంటున్న హింసాత్మక ఘటనలకు, ఉద్రిక్త పరిస్థితులకు ఆ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తులే పూర్తి కారణమని ఆయన స్పష్టం చేశారు. విద్యార్థుల గళాన్ని నొక్కేయడానికే ఇలాంటి వ్యూహాలు పన్నుతున్నారని మండిపడ్డారు. ఆందోళనల క్రమంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ.. కొందరు అపరిచిత వ్యక్తులు సివిల్ డ్రెస్లో నిరసన స్థలాల్లోకి వస్తున్నారని అభిజిత్ దీప్కే వెల్లడించారు.
Also Read : దిగి వచ్చిన మోడీ.. కీలక ప్రకటన..
అలా వచ్చిన వారు కావాలనే అక్కడ ఉన్న అమాయక విద్యార్థులపై దాడులకు తెగబడుతున్నారని, దీనివల్ల ఆందోళనల అసలు ఉద్దేశం పక్కదారి పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల భద్రతపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సుదీర్ఘ వివాదానికి మరియు లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు తాము ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉన్నామని సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కే స్పష్టం చేశారు. ఈ పరీక్షల లీకేజీ అంశంపై ప్రభుత్వంతో నేరుగా చర్చలు జరిపేందుకు తమ పార్టీ మరియు విద్యార్థి సంఘాల ప్రతినిధులు సిద్ధంగా ఉన్నారని ప్రకటించారు. ప్రభుత్వం ఇప్పటికైనా పట్టువిడుపులతో వ్యవహరించి విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను ఆలకించాలని ఆయన డిమాండ్ చేశారు.

