రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్పై వేటు ఖాయమనే మాట బాగా వినిపిస్తోంది. పంజాబ్ కింగ్స్తో జరిగిన ఐపీఎల్ 2026 మ్యాచ్ సందర్భంగా కెప్టెన్ రియాన్ పరాగ్ జట్టు డ్రెస్సింగ్ రూమ్లో వేపింగ్ చేస్తూ కెమెరాకు చిక్కడంతో కొత్త వివాదంలో చిక్కుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, అభిమానుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో అతనిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. పరాగ్ తన సహచరులతో కలిసి డ్రెస్సింగ్ రూమ్లో కూర్చుని, వేప్ పరికరంలా కనిపించే దానిని ఉపయోగిస్తున్న దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి. ఈ క్లిప్ ఆన్లైన్లో బాగా వైరల్ అయ్యింది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో, స్టేడియం ప్రాంగణంలోనే ఇలా చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Also Read : ఏపీ పోలీస్ శాఖలో భారీ ప్రక్షాళన..!
బీసీసీఐ మార్గదర్శకాల ప్రకారం, కేటాయించిన ధూమపాన జోన్లు మినహా ఐపీఎల్ స్టేడియం ప్రాంగణంలో ధూమపానం, వేపింగ్, పొగాకు, మద్యం సేవించటం పూర్తిగా నిషేధం. అయితే పరాగ్ వీటిని అతిక్రమించినట్లు స్పష్టమైంది. దీంంతో అతని చర్య ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనగా పరిగణించబడుతోంది. ఈ ఘటనను సమీక్షించిన బీసీసీఐ క్రమశిక్షణా చర్య అవసరమా కాదా అని నిర్ణయించవచ్చని నివేదికలు సూచిస్తున్నాయి. 2019 ఎలక్ట్రానిక్ సిగరెట్ల నిషేధ చట్టం ప్రకారం భారతదేశంలో వేపింగ్ నిషేధించబడినందున ఈ వివాదం మరింత పెద్దదైంది. ఈ చట్టం ఇ-సిగరెట్ల ఉత్పత్తి, అమ్మకం, నిల్వ, ప్రకటనలను నిషేధిస్తుంది.
ఈ సీజన్లో రాజస్థాన్ రాయల్స్కు సంబంధించి వివాదం చోటుచేసుకోవడం ఇది మొదటిసారి కాదు. గతంలో ఒక మ్యాచ్ సందర్భంగా డగౌట్లో మొబైల్ ఫోన్ వాడుతూ మ్యాచ్-డే ప్రోటోకాల్స్ను ఉల్లంఘించినందుకు టీమ్ మేనేజర్ రోమీ భిందర్కు బీసీసీఐ జరిమానా విధించింది. ఆసక్తికరంగా, మైదానం వెలుపల నాటకీయ పరిణామాలు ఉన్నప్పటికీ, రాజస్థాన్ రాయల్స్ మాత్రం మైదానంలో బలంగా రాణించింది. పంజాబ్ కింగ్స్ నిర్దేశించిన 220కి పైగా పరుగుల భారీ లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించి, అద్భుతమైన విజయాన్ని సాధించింది.
Also Read : ఏపీ సచివాలయంలో వైసీపీ ధురంధర్లు..!
కొంతమంది అభిమానులు మాత్రం పరాగ్పై కఠిన చర్యలు తీసుకోవాలని తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఇది వ్యక్తిగత విషయమని, దీనిని అనవసరంగా పెద్దది చేస్తున్నారని వాదించారు. ఐపీఎల్ వంటి ప్రతిష్టాత్మక టోర్నమెంట్ల సమయంలో ఆటగాళ్లను ఎంత నిశితంగా గమనిస్తారో ఈ ఘటన మరోసారి స్పష్టం చేసింది. ముఖ్యంగా కెప్టెన్లకు, బహిరంగ ప్రవర్తన అదనపు బాధ్యతను మోస్తుంది. బీసీసీఐ అధికారిక చర్య తీసుకున్నా తీసుకోకపోయినా, ఈ వివాదం ఇప్పటికే ఐపీఎల్ 2026లో అతిపెద్ద చర్చనీయాంశాలలో ఒకటిగా మారింది.

