Saturday, September 19, 2026 09:11 PM
Saturday, September 19, 2026 09:11 PM

దావూద్ దొరుకుతాడా..? అసలు ఎవరీ సలీం డోలా..?

అంతర్జాతీయ డ్రగ్ మాఫియా నెట్వర్క్‌ పై భారత ప్రభుత్వం చేపట్టిన ‘జీరో టాలరెన్స్’ ఆపరేషన్‌ లో భాగంగా జరిగిన ఓ పరిణామం సంచలనంగా మారింది. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు అత్యంత సన్నిహితుడు, డి-కంపెనీ డ్రగ్ సామ్రాజ్యానికి మాస్టర్ మైండ్‌ గా పేరుగాంచిన మొహమ్మద్ సలీం డోలాను టర్కీ నుండి విజయవంతంగా భారత్‌ కు తీసుకువచ్చారు. టర్కీలోని ఇస్తాంబుల్‌లో అరెస్టయిన ఇతనిని ఏప్రిల్ 28 తెల్లవారుజామున ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తరలించారు.

Also Read : ఏపీ పోలీస్ శాఖలో భారీ ప్రక్షాళన..!

సలీం డోలా కేవలం ఒక సాధారణ నేరగాడు కాదు; దావూద్ ఇబ్రహీం ఆర్థిక మూలాలకు వెన్నెముక వంటివాడు. ఛోటా షకీల్‌ కు అత్యంత నమ్మకస్తుడైన ఇతను, గత మూడు దశాబ్దాలుగా ముంబై నుండి దుబాయ్ వరకు, టర్కీ నుండి యూరప్ వరకు భారీ డ్రగ్ నెట్వర్క్‌ ను నిర్మించాడు. 2018లో ముంబైలో 100 కిలోల ప్రమాదకరమైన ఫెంటానిల్ డ్రగ్‌ తో పట్టుబడిన తర్వాత, బెయిల్‌ పై బయటకు వచ్చి విదేశాలకు పారిపోయాడు. అప్పటి నుండి నకిలీ గుర్తింపుతో టర్కీలో తలదాచుకుంటున్నాడు.

సలీం డోలా నడిపిస్తున్న డ్రగ్ నెట్వర్క్ విలువ సుమారు రూ.5,000 కోట్లు ఉంటుందని దర్యాప్తు సంస్థల అంచనా. ఇరాన్, యూఏఈ మరియు టర్కీ కేంద్రంగా ఇతను సింథటిక్ డ్రగ్స్‌ ను తయారు చేయించి దేశవ్యాప్తంగా సరఫరా చేసేవాడు. ఈ డ్రగ్స్ అమ్మగా వచ్చిన డబ్బును హవాలా మార్గాల ద్వారా టెర్రర్ ఫండింగ్‌కు వాడుతున్నట్లు పక్కా ఆధారాలు లభించాయి. యువతను మాదకద్రవ్యాల ఊబిలోకి నెట్టి, ఆ డబ్బుతో దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటంలో ఇతను సిద్ధహస్తుడు.

Also Read : బ్రేకింగ్: ఏపీకి కేంద్ర మంత్రి క్రేజీ గుడ్ న్యూస్..!

కేంద్ర హోం శాఖ పర్యవేక్షణలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు సమన్వయంతో ఆపరేషన్ గ్లోబల్ హంట్ ను నిర్వహించాయి. ఇంటర్‌ పోల్ సహాయంతో ఇస్తాంబుల్‌ లో ఇతని లోకేషన్‌ ను కనిపెట్టి, టర్కీ పోలీసుల సహకారంతో అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఢిల్లీలోని ఎన్సీబీ కార్యాలయంలో ఇతనిపై లోతైన విచారణ జరుగుతోంది. సలీం డోలా విచారణలో దావూద్ ఇబ్రహీం ఆచూకీ మరియు డి-కంపెనీ రహస్యాలపై కీలక సమాచారం లభించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుమల లడ్డూ పై,...

ఈడీ అంటే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌.. ఈ...

ఇప్పటికీ వారికే పదవులు.....

కూటమి ప్రభుత్వం ఏర్పడి, దాదాపు రెండున్నర...

సాయిరెడ్డి.. నెట్టుకు రాగలరా.....

కొత్త ఎపుడూ వింతే. అందుకే కొత్తగా...

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

పోల్స్