Wednesday, April 22, 2026 07:54 PM
Wednesday, April 22, 2026 07:54 PM

పిఠాపురంలో రగులుతున్న కూటమి, వర్మ సంచలన ట్వీట్..!

పిఠాపురం నియోజకవర్గంలో కూటమి నేతల మధ్య విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత ఎస్వీఎస్ఎన్ వర్మ నేడు తన సోషల్ మీడియా వేదికగా చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. సిఎం చంద్రబాబు ఫోటో లేకపోవడాన్ని ప్రశ్నించినందుకు తనపై, తన కార్యకర్తలపై దాడులు జరిగాయని వర్మ ఆరోపించారు. నిన్న ఒక అధికారిక లేదా పార్టీ కార్యక్రమంలో సిఎం చంద్రబాబు ఫోటో లేకపోవడాన్ని వర్మ ప్రశ్నించారు.

Also Read : అజ్ఞాతంలోకి అనంతబాబు బిగుస్తున్న ఉచ్చు..!

ఈ క్రమంలో తనపై మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై కొందరు దాడులకు దిగారని, నోటికొచ్చినట్లు అసభ్య పదజాలంతో దూషించారని వర్మ ఆవేదన వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గెలుపుకు వ్యతిరేకంగా పనిచేశారని దొరబాబుపై వర్మ నేరుగా విరుచుకుపడ్డారు. పవన్ గెలుపును అడ్డుకోవాలని చూసిన దొరబాబు, ఇప్పుడు కూటమిలోకి వచ్చి పెత్తనం చలాయించడం ఏంటని ప్రశ్నించారు. దొరబాబు ఇప్పటికీ వైసీపీ కోవర్టుగా పనిచేస్తున్నారని వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Also Read : అజ్ఞాతంలోకి అనంతబాబు బిగుస్తున్న ఉచ్చు..!

కూటమిలో ఉంటూనే నేతల మధ్య తగాదాలు సృష్టిస్తూ, పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. ఈ పరిణామాలపై వర్మ నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ట్యాగ్ చేస్తూ ఫిర్యాదు చేశారు. పిఠాపురంలో జరుగుతున్న ఈ అంతర్గత పోరు కూటమి ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉందని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేసారు. వర్మ వర్గీయులు నేడు నిరసనలకు సిద్ధమవుతుండటంతో నియోజకవర్గంలో ఉద్రిక్తత నెలకొంది. మరోవైపు దొరబాబు వర్గం ఈ ఆరోపణలపై ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

అజ్ఞాతంలోకి అనంతబాబు బిగుస్తున్న...

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడిగా...

మాజీ సీఎం నాదెండ్ల...

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నాదెండ్ల...

నయా రథసారధి.. ముహూర్తం...

ఏపీలో కూటమి ప్రభుత్వాన్ని నడుపుతున్న టీడీపీలో...

ఈరోజు రాశి ఫలితాలు...

శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం,...

మహానాడు వేదిక ఖరారు.....

తెలుగుదేశం పార్టీకి ఎంతో ప్రతిష్టాత్మకమైంది మహానాడు....

పెద్ద దస్తగిరి హత్య...

కడపలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి పెద్ద...

పోల్స్