Wednesday, August 19, 2026 10:13 PM
Wednesday, August 19, 2026 10:13 PM

ఇరాన్-అమెరికా యుద్ధం.. భారత విద్యార్థులకు చుక్కలు..!

ప్రస్తుతం పశ్చిమాసియాలో జరుగుతోన్న యుద్ధం.. కేవలం ఆ ప్రాంతానికే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో విధాలుగా ప్రభావం చూపిస్తోంది. ముఖ్యంగా ఇరాన్‌ పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్లిన భారత విద్యార్థులు భవిష్యత్తుపై నీలి నీడలు కమ్ముకున్నాయి. యుద్ధం కారణంగా మారుతున్న రాజకీయ పరిణామాలు, వీసా నిబంధనలు వారి కెరీర్‌ ను ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు విద్యార్ధులకు చుక్కలు చూపిస్తున్నాయి.

Also Read : మళ్ళీ దొరికిపోయిన ధనుష్, మృణాల్..?

అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ అధికారంలో ఉన్న తరుణంలో, యుద్ధ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కఠినమైన వీసా నిబంధనలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే నిరసనల్లో పాల్గొన్న లేదా యుద్ధానికి వ్యతిరేకంగా గళం ఎత్తిన కొంతమంది విద్యార్థుల వీసాలను రద్దు చేయడం, వారిని వెనక్కి పంపించే అంశాలపై చర్చ జరుగుతుండటం విద్యార్థులను భయపెడుతోంది. యుద్ధం కారణంగా అమెరికాలో ఫీజులు కూడా భారీగా పెరిగే అవకాశం కనపడుతోంది. అదే విధంగా యుద్ధం కారణంగా పశ్చిమాసియా గగనతలం మూసివేయడం కూడా ప్రభావం చూపుతోంది.

దీనివల్ల అమెరికా నుండి భారత్‌కు వచ్చే విమానాలు సుదీర్ఘ మార్గాల్లో ప్రయాణించాల్సి వస్తోంది. ఇంధన ధరలు భారీగా పెరగడంతో విమాన టికెట్ల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. గతంలో కంటే ఎక్కువ సమయం ప్రయాణించాల్సి రావడంతో విద్యార్థులు అత్యవసరంగా ఇంటికి రావడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. యుద్ధం వల్ల అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరిగి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యే ప్రమాదం ఉంది. అమెరికాలో ధరలు పెరిగిపోవడం కూడా విద్యార్ధులపై ప్రభావం పడుతోంది.

Also Read : వైసీపీలో చెవిరెడ్డి శకం ముగిసినట్లే..? లిక్కర్ కేసు తర్వాత మారిన సీన్..!

పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకునే వారికి ధరలతో చుక్కలు కనపడుతున్నాయి. ఇది అమెరికాలోని ఐటీ మరియు ఇతర రంగాల ఉద్యోగ అవకాశాలపై ప్రభావం చూపుతుంది. చదువు పూర్తయ్యాక అక్కడే ఉద్యోగం చేయాలనుకునే విద్యార్థులు కంపెనీలు కొత్త నియామకాలను నిలిపివేస్తాయేమోనని భయపడుతున్నారు. యుద్ధ సమయంలో అమెరికాలోని పలు యూనివర్సిటీల వద్ద భద్రత పెంచినప్పటికీ, జాతి వివక్ష లేదా విద్వేషపూరిత దాడులు జరుగుతాయేమోనన్న భయాందోళనలు విద్యార్థుల్లో ఉన్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

పరిశ్రమల్లో పచ్చని విప్లవం.....

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధితో పాటు...

భారత్ ఘన విజయం.....

గాలే అంతర్జాతీయ మైదానంలో శ్రీలంకతో జరిగిన...

టాలీవుడ్ కు షాక్...

తెలంగాణలో భారీ బడ్జెట్ సినిమాల టికెట్...

సాయిరెడ్డి పార్టీ.. వైసీపీలో...

ఏపీలో మరో కొత్త రాజకీయ పార్టీ...

ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో...

టాలీవుడ్ ప్రముఖ నటి నిధి అగర్వాల్‌కు...

ప్రత్యక్ష ఎన్నిక.. తెలుగు...

మున్సిపల్ ఛైర్మన్లు, కార్పొరేషన్ల మేయర్లను ప్రజలు...

పోల్స్