Friday, May 1, 2026 10:53 AM
Friday, May 1, 2026 10:53 AM

బ్రేకింగ్: భారత్ కు ఘోర అవమానం

రష్యన్ ముడి చమురు కొనుగోలు అంశానికి సంబంధించి గత కొన్ని నెలలుగా భారత్ ను అమెరికా ఇబ్బంది పెడుతోన్న సంగతి తెలిసిందే. తమ ఆయిల్ ను భారత్ కొనుగోలు చేసే విధంగా ఒత్తిడి తీసుకొస్తున్న అమెరికా.. రష్యా ముడి చమురు కొనుగోలు చేసినందుకు గానూ.. సుంకాలు విధించింది. ఇక తాజాగా ఇజ్రాయిల్ – ఇరాన్ యుద్ధం నేపధ్యంలో.. ప్రస్తుతం రవాణాలో.. అంటే జల మార్గాలపై ఉన్న ఉన్న చమురును కొనుగోలు చేయడానికి భారత్ కు ఇటీవల అమెరికా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Also Read : సత్యం, నమ్మకం.. వైసీపీ నోట వింత మాటలు..!

నిన్న ఈ మేరకు అమెరికా ట్రెజరీ డిపార్ట్‌మెంట్ ఈ మేరకు లైసెన్స్ జారీ చేసింది. వచ్చే నెల 3 వరకు ఈ అనుమతులు ఉంటాయి అని అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ శుక్రవారం ఫాక్స్ బిజినెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. భారతీయులు చాలా మంచి నటులు అని.. తన స్వార్ధ ప్రయోజనాల కోసం భారత్ డ్రామా ఆడుతోందనే విధంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆగ్రహం కలిగిస్తున్నాయి.

Also Read : కేతిరెడ్డి అరెస్ట్ కు రంగం సిద్దం..?

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జల మార్గాల్లో.. వందల మిలియన్ల బ్యారెళ్ల ముడి చమురు ఉందని ఆయన వ్యాఖ్యానిస్తూ.. భారత్ రెండు వైపులా మాట్లాడుతోంది అంటూ కామెంట్ చేసారు. ఇప్పటికే.. మన డబ్బుతో మనం ఎక్కడ ఆయిల్ కొనుక్కోవాలో చెప్తున్న అమెరికా.. ఈ తరహాలో భారత్ ను అవమానించడం పట్ల తీవ్ర విమర్శలు వస్తున్నాయి. భారత్ తన ప్రయోజనాల కోసం నిజాయితీ లేకుండా వ్యవహరిస్తుందని బీసెంట్ మాట్లాడటం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

మాట తప్పిన కేంద్రం.....

కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్‌డీఏ సర్కార్...

అబార్షన్ చట్టంపై సుప్రీంకోర్టు...

14 ఏళ్ల అత్యాచార బాధితురాలి అబార్షన్...

ఏపీ బ్రాండ్‌కి సచిన్‌...

నారా లోకేశ్‌ క్రికెట్‌ మ్యాచ్‌లు చూడటానికి...

తల్లికి వందనం అప్పుడే.....

2026-27 విద్యా సంవత్సరం నేపథ్యంలో కూటమి...

మరో పార్టీ నేతను...

రాజకీయాల్లో ఇప్పుడు విపరీత ధోరణి కనిపిస్తోంది....

టెన్త్ ఫలితాల్లో లోకేష్...

ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్...

పోల్స్