Wednesday, April 8, 2026 11:46 PM
Wednesday, April 8, 2026 11:46 PM

జీవితంలో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన శిఖర్ ధావన్

టీమ్ ఇండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధవన్ తన వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. ఫిబ్రవరి 21న ఢిల్లీ NCRలో జరిగిన ఓ ప్రైవేట్ వేడుకలో తన దీర్ఘకాల స్నేహితురాలు సోఫీ షైన్‌ను వివాహం చేసుకున్నారు. ఈ వేడుకను కుటుంబ సభ్యులు, సన్నిహిత మిత్రుల మధ్య సాదాసీదాగా నిర్వహించారు. క్రికెటర్ యుజ్వేంద్ర చహల్ సోషల్ మీడియాలో వారి వివాహ వేడుకకు సంబంధించిన కొన్ని ఫోటోలను పంచుకున్నారు. దీంతో వీరి వివాహం గురించి బయటి ప్రపంచానికి తెలిసింది. 2025లో దుబాయ్‌లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా వీరిద్దరూ కలిసి కనిపించగా, అదే సంవత్సరం చివరలో తమ సంబంధాన్ని అధికారికంగా ప్రకటించారు.

Also Read : టీమిండియా అప్‌డేట్‌.. ఫైనల్ టీమ్‌లోకి శాంసన్..!

ఐర్లాండ్‌కు చెందిన సోఫీ షైన్ మార్కెటింగ్ మరియు మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ పూర్తి చేసి, ప్రస్తుతం అబుదాబిలోని నార్తర్న్ ట్రస్ట్ కార్పొరేషన్‌లో సెకండ్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్నారు. ఆమె శిఖర్ ధవన్ ఫౌండేషన్‌కు నాయకత్వం వహిస్తూ సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో నిశ్చితార్థం ప్రకటించిన ఈ జంట, ఇప్పుడు వివాహ బంధంతో ఒక్కటైంది. ఈ వార్తతో శిఖర్ అభిమానులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Shikhar Dhawan Weds Sophie Shine

Also Read : స్టేజి పైనే వరలక్షి శరత్ కుమార్ కన్నీటి కృతజ్ఞత

ఇది ధవన్ జీవితంలో కొత్త ప్రారంభం. ఆయనకు ముందుగా అయేషా ముఖర్జీతో వివాహం కాగా, వారికి జొరావర్ అనే కుమారుడు ఉన్నాడు. తన కన్నా వయసులో పెద్దదైన అయేషా ముఖర్జీని ప్రేమ వివాహం చేసుకున్న శిఖర్, గత కొన్ని సంవత్సరాలుగా దూరంగా ఉంటున్నారు. పెళ్లి అయినప్పటి నుంచి అయేషా ఆస్ట్రేలియాలో జీవనం కొనసాగిస్తుండగా, శిఖర్ మాత్రం జాతీయ జట్టులో ఉండాల్సి రావడంతో భారత్ లోనే ఉన్నాడు. అయితే విభేధాల నేపధ్యంలో తన కుమారుడిని చూడటానికి లేకుండా చేయడంతో బాగా కుంగిపోయాడు. ఏది ఏమైనా ఈ కొత్త జీవిత ప్రయాణానికి అభిమానులు మరియు క్రికెట్ ప్రపంచం నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

రోజాకు బిగుస్తున్న ఉచ్చు.....

వైసీపీ హయాంలో ఎంతో ఆర్భాటంగా నిర్వహించిన...

భోగాపురం ముహుర్తం ఫిక్స్..!

ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న భోగాపురం...

బ్రేకింగ్ : రెడ్డప్పగారి...

పార్టీ కేడర్‌ను పట్టించుకోని నేతలపై టీడీపీ...

దేవాదాయ శాఖలో ఏసీబీ...

గత రెండేళ్ళ నుంచి ఏపీలో హాట్...

కేసీఆర్ బయటకు వస్తారా.....

భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు, మాజీ...

తమిళనాడులో అలా.. మరి...

చట్టం అందరికీ సమానమే. బాధితులకు న్యాయం...

పోల్స్