ఏళ్ళ తరబడి సాగుతున్న ఉక్రెయిన్ – రష్యా యుద్దాన్ని ముగించేందుకు కీలక అడుగులు పడుతున్నాయి. దాదాపు నాలుగు సంవత్సరాల యుద్ధాన్ని ముగించడానికి అమెరికా నేతృత్వంలోని ప్రయత్నాలు ముమ్మరం కావడంతో, శాంతి చర్చల కోసం మాస్కోకు రావాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీని రష్యా కోరినట్లు క్రెమ్లిన్ గురువారం తెలిపింది. రెండు దేశాలు యుద్దంలో వెనక్కు తగ్గకపోవడంతో పరిణామాలు రోజు రోజుకి తీవ్రంగా మారుతున్నాయి. అటు అమెరికా కూడా యుద్దాన్ని ఆపే ప్రయత్నాలు చేస్తూ వస్తోంది.
Also Read : పాక్ డ్రామాలకు ఐసీసీ చెక్.. ఓవర్ చేస్తే రిజల్ట్ అదే..!
గత వారాంతంలో అబుదాబిలో అమెరికా మధ్యవర్తిత్వం వహించిన శాంతి చర్చలు శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకునే ప్రయత్నాలకు కొత్త ఊపునిచ్చాయి. అయితే రష్యా – ఉక్రేనియన్ చర్చల వైఖరి మధ్య తీవ్ర విభేదాలు కొనసాగుతున్నాయి. భీకర పోరాటం ఇప్పటికీ కొనసాగుతుండగా, ఉక్రెయిన్ పై ఇటీవల క్షిపణి దాడులు జరగడంతో వాతావరణం మరింత వేడెక్కింది. త్వరలోనే ఇరు దేశాల అధ్యక్షులు సమావేశం అయ్యే అవకాశం ఉందని అమెరికా మీడియా వెల్లడించింది. ఈ సమావేశానికి ట్రంప్ కూడా హాజరు అయ్యే ఛాన్స్ కనపడుతోంది.
Also Read : ప్రధాని ఫోన్ కు రెడ్ స్టిక్కర్ వెనుక ఇంత స్టోరీ ఉందా..?
రష్యా – ఉక్రెయిన్ చర్చల ప్రతినిధుల మధ్య ఆదివారం మరో దశ చర్చలు అబుదాబిలో జరగనున్నాయి. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత యూరప్ లో అతిపెద్ద యుద్ధంగా చెప్తున్న ఈ యుద్దాన్ని.. ముగించేందుకు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, తాజా ఒప్పందంలోనైనా ఎవరికి ఏ భూభాగం లభిస్తుందనే దానిపై, యుద్ధానంతర ఉక్రెయిన్లో అంతర్జాతీయ శాంతి పరిరక్షకులు లేదా మానిటర్ల జోక్యం, రష్యా నియంత్రణలో ఉన్న జపోరిజ్జియా అణు విద్యుత్ ప్లాంట్ భవిష్యత్తు వంటి అంశాలపై ఇప్పటికీ విభేదాలు కొనసాగుతున్నాయి.

