ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో బిజీ బిజీగా గడుపుతున్నారు. చాలా రోజుల తర్వాత ఢిల్లీ వెళ్ళిన పవన్ కళ్యాణ్ కు ఢిల్లీలో అపూర్వ స్వాగతం లభించింది. ఏపీ ఎన్డియే కూటమి నుంచి సిఎం చంద్రబాబు లేదా మంత్రి నారా లోకేష్ మాత్రమే ఢిల్లీ వెళ్తున్నారు. తాజాగా ఢిల్లీ వెళ్ళిన డిప్యూటి సిఎం, పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. పంచాయితీ రాజ్ శాఖతో పాటుగా అటవీ శాఖకు నిధులు కేటాయించే అంశంపై ఆయన కేంద్ర మంత్రులతో చర్చించారు.
Also Read : 18 ఏళ్లు.. 30 ట్రాన్స్ఫర్లు.. ఎందుకు ఇంత పగ..?
కేంద్ర రైల్వే, సమాచార, ప్రసార శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ ను కలిసిన పవన్ కళ్యాణ్.. పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన అనేక కీలక అంశాలపై ఈ సమావేశంలో వినతిపత్రం, పలు అంశాలను మంత్రికి వివరించారు. పీఎం గతి శక్తి పథకం కింద పిఠాపురం పరిధిలో సామర్లకోట – ఉప్పాడ రోడ్డుపై రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని విజ్ఞప్తి చేసారు. దీని ద్వారా ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం ఉంటుందని మంత్రికి వివరించారు. జాతీయ రైల్వే ప్రణాళిక – 2030లోని మాన్యువల్ లెవల్ క్రాసింగ్ లను తొలగించాలనే లక్ష్యాలకు అనుగుణంగా ఉంటుందన్నారు.
Also Read : ఆధారాల్లేకుండా ఆరోపణలు… ఇదేనా సాక్షి జర్నలిజం?
ఇదే పర్యటనలో పవన్ కళ్యాణ్.. మరికొంత మంది కేంద్రమంత్రులతో భేటీ అవుతారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా భేటీ అయిన పవన్.. వ్యవసాయ శాఖా మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ తో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరతో పాటుగా పలు అంశాలను వారి దృష్టికి తీసుకుని వెళ్తారు. వీరి తర్వాత కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తో కూడా ఆయన భేటీ అయ్యే అవకాశం ఉంది. అటు బిజెపికి కొత్తగా చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన నితిన్ నబీన్ తో కూడా పవన్ భేటీ కానున్నారు.

