Sunday, March 22, 2026 07:23 AM
Sunday, March 22, 2026 07:23 AM

బాక్సాఫీస్ వద్ద అఖండ తాండవం..!

నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో, బోయపాటి శ్రీను డైరెక్షన్ లో వచ్చిన అఖండ సీక్వెల్ బాక్సాఫీస్ వద్ద తాండవం చేస్తోంది. భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా రెండు రాష్ట్రాల్లో భారీ వసూళ్లు సాధిస్తోంది. నైజాంలో వీర సింహారెడ్డి వసూళ్లతో సమానంగా ఈ సినిమా డామినేషన్ ప్రదర్శించింది. శుక్రవారం విడుదలైన ఈ సినిమా భారీ బడ్జెట్ తో వచ్చిన సంగతి తెలిసిందే. అసలు ఈ సినిమా లెక్కలు ఒకసారి చూస్తే..

Also Read : కారు ఇంజిన్ లో కవిత మంటలు.. ఆ మాట ఎందుకు మాట్లాడినట్టు..?

నైజాం: 7.1 కోట్లు, సీడెడ్: 5.3 కోట్లు, గుంటూరు: 3.4 కోట్లు, ఉత్తరాంధ్ర: 2.4 కోట్లు, తూర్పు: 2.19 కోట్లు, పశ్చిమం: 1.55 కోట్లు, కృష్ణ: 1.7 కోట్లు, నెల్లూరు: 1.4 కోట్లు, ఇతర రాష్ట్రాలు: 2.25 కోట్లు, ఓవర్సీస్: 2.75 కోట్లు మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా 30.04 కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టింది ఈ సినిమా. ఇక ఈ సినిమా ఈ వీకెండ్ వసూళ్ళపైనే భారీ ఆశలు పెట్టుకుంది. అటు నార్త్ లో కూడా ఈ సినిమా భారీ వసూళ్లు సాధించే అవకాశం కనపడుతోంది. పార్ట్ 1 కు నార్త్ లో ఆలస్యంగా పబ్లిసిటీ కావడంతో వసూళ్లు భారీగా సాధించింది.

Also Read : అఖండ 2 పై విమర్శలు చేస్తున్నవారికి దిమ్మతిరిగే సమాధానం

ఇప్పుడు ఈ సినిమా కూడా అదే స్థాయిలో నార్త్ లో వసూళ్లు సాధించే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక అఖండ 2 మొదటి రోజు కలెక్షన్లతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సీక్వెల్ ప్రపంచవ్యాప్తంగా 30 కోట్ల షేర్ వసూలు చేసింది. బ్రేక్ ఈవెన్ 110 కోట్ల రూపాయలు కాగా.. 27 శాతం రాబట్టడంతో.. మిగిలిన వసూళ్ళపై చిత్ర యూనిట్ ఈ రెండు రోజులపైనే భారీ ఆశలుపెట్టుకుంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్