Sunday, March 22, 2026 10:14 AM
Sunday, March 22, 2026 10:14 AM

సంచార్ సాథీ ఓ పెగాసస్..? కేంద్రంపై తీవ్ర విమర్శలు..!

సైబర్ సెక్యూరిటీతో పాటు వ్యక్తిగత భద్రత విషయంలో టెక్నాలజీని వినియోగించుకునే విషయంలో కీలక అడుగులు వేస్తోన్న కేంద్రం.. తాజాగా ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. భారత్ లో విక్రయించే అన్ని మొబైల్ ఫోన్ లలో.. సంచార్ సాథీ యాప్‌ ను తప్పనిసరిగా ఇన్‌స్టాల్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అనుమానాస్పద కాల్‌ లు, మెసేజ్ లు, ఫ్రాడ్ మెసేజ్ లు, ఫ్రాడ్ కాల్స్ గురించి నేరుగా ఈ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. మీ పేరుపై ఎన్ని మొబైల్ కనెక్షన్లు ఉన్నాయో తెలుసుకోవచ్చు.

Also Read : ఐబొమ్మకు సినిమాలు అమ్మిన నిర్మాతలు..?

దొంగిలించబడిన లేదా పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను ఈ యాప్ బ్లాక్ చేస్తుంది. మొబైల్ హ్యాండ్సెట్ ఐఎంఈఐ నెంబర్ ద్వారా నకిలీ లేదా మార్చిన ఫోన్ లను గుర్తిస్తారు. ఇందులో ఆడియో ఫిర్యాదులు కూడా చేసే అవకాశం ఉంది. అయితే దీనిపై సోషల్ మీడియాలో పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో చాలా మంది దీనిని పెగాసస్ స్పైవేర్‌తో పోలుస్తున్నారు. ఇప్పటికే మార్కెట్‌ లో ఉన్న ఫోన్‌ లలో కూడా సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ద్వారా యాప్‌ ను ఇన్‌స్టాల్ చేయాలని ప్రభుత్వం కంపెనీలను కోరింది.

Also Read : ఐపీఎస్ సునీల్ పొలిటికల్ ఎంట్రీ ఖాయమా..!

ఇందుకోసం 90 రోజుల గడువు ఇచ్చింది కేంద్రం. ఈ యాప్ ను రిమూవ్ చేయడం లేదా, పర్మీషన్ లు ఆపడం సాధ్యం కాదు. గతంలో పెగాసస్ స్పై వేర్ విషయంలో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. టార్గెట్ చేసిన ఫోన్ లో ఉన్న డేటా తెలుసుకునేందుకు ఈ సాఫ్ట్ వేర్ వాడుతున్నట్టు విమర్శలు వచ్చాయి. ఇప్పుడు బహిరంగంగా ఈ యాప్ ను ఇన్స్టాల్ చేయాలనే ఆదేశాలు ఇవ్వడంతో విమర్శలు వస్తున్నాయి. ఈ యాప్ చాలా డేటా యాక్సెస్ చేసే అవకాశం కల్పిస్తుంది. ఫోటోలు, డేటా, మెసేజ్ లు, ఇతర యాప్ ల వాడకం సహా అనేక విషయాలపై నిఘా పెడుతుంది. దీనితో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం దీనిని పెగాసస్ తో పోల్చారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్