Wednesday, February 4, 2026 01:46 PM
Wednesday, February 4, 2026 01:46 PM

ఆ ఒక్కడు కూడా ఎన్కౌంటర్..? మావోయిస్ట్ చరిత్ర ముగిసినట్టే..?

1967 లో నక్సల్బరీ గ్రామంలో మొదలైన మావోయిస్ట్ ఉద్యమం ఎట్టకేలకు ముగింపు దశకు చేరుకుంది. వచ్చే ఏడాది మార్చ్ 31 నాటికి దేశంలో మావోయిస్ట్ లను లేకుండా చేస్తామని, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించిన నేపధ్యంలో.. ఆపరేషన్ కగార్ ను బలగాలు తీవ్రతరం చేసాయి. చత్తీస్ఘడ్ లోని ఆఖరి కోటను కూల్చడంలో బలగాలు విజయవంతం అయ్యాయి అనే చెప్పాలి. ఒకప్పుడు 30 వేల మందితో అత్యంత పటిష్టంగా ఉన్న మావోయిస్ట్ పార్టీ.. నేడు కేవలం 500 మందికి మాత్రమే పరిమితం అయింది.

Also Read : మల్లోజుల మరో సంచలన వీడియో.. చనిపోవద్దు ప్లీజ్..!

2000 సంవత్సరం ప్రారంభంలో మావోయిస్ట్ పార్టీ ప్రభావం దేశంలో ఎక్కువగా ఉండేది. మొత్తం 125 జిల్లాల్లో మావోయిస్ట్ లు శక్తివంతమైన ప్రభావం చూపించారు. ఆ తర్వాత 2004 లో చర్చల తర్వాతి నుంచి అగ్ర నేతలను ఒక్కొక్కరిని మావోయిస్ట్ లు కోల్పోతూ వచ్చారు. 2010 ముందు వరకు కొంత ప్రభావం చూపించిన అన్నలు.. 2018 తర్వాతి నుంచి ప్రాభవం కోల్పోతూ వచ్చారు. ఆపరేషన్ గ్రీన్ హంట్ సహా ఎన్నో ఆపరేషన్ లు చేపట్టినా సరే వారిని అంతం చేయలేని కేంద్రం.. ఆపరేషన్ కగార్ తో మాత్రం సక్సెస్ అయింది.

Also Read : పరకామణి కేసులో అన్ని వేళ్లు ఆయన వైపే..!

ఇక తాజాగా జరుగుతున్న ఎన్కౌంటర్ లలో.. మాడ్వీ హిడ్మా సహా వరుస అగ్ర నేతలు ప్రాణాలు కోల్పోతున్నారు. నేడు జరిగిన ఎన్కౌంటర్ లో మెట్టూరి జోగారావు అలియాస్ టెక్ శంకర్ కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఆయుధాల తయారీలో అతినిది అందెవేసిన చేయి. ఇక ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఉద్యమాన్ని నడపడం మావోలకు కష్టమే. మరో అగ్ర నేత, పార్టీ ప్రధాన కార్యదర్శి తిప్పిరి తిరుపతి కూడా మరణించారు అనే వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే మాత్రం పూర్తిగా ఉద్యమం అంతమైనట్లే.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

దమ్ముంటే అసెంబ్లీకి రా.....

గత రెండు రోజులుగా తనను ఉద్దేశించి...

పోల్స్