అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణయాలు భారత్ సహా అనేక దేశాల పౌరులను ఆందోళనకు గురి చేస్తోన్న సంగతి తెలిసిందే. హెచ్ 1 బీ వీసాల ఫీజులను భారీగా పెంచడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అమెరికా వెలుపల నుంచి వెళ్ళే వారికి లక్ష డాలర్ల ఫీజు విధించారు డోనాల్డ్ ట్రంప్. దీనితో హెచ్ 1 బీ వీసాపై అమెరికా వెళ్ళాలి అనుకునే వారి కలలు ఒక్కసారిగా కూలిపోయాయి. దాదాపు కోటి రూపాయల వరకు ఖర్చు అయ్యే పరిస్థితి ఉండటంతో చాలా మంది ఆలోచన విరమించుకున్నారు.
Also Read : విలువల్లేని బిగ్ బాస్.. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ రచ్చ
వీసా రెన్యువల్ విషయంలో కూడా అదే వర్తించడం భయపెట్టింది. ఈ నేపధ్యంలో తాజాగా ట్రంప్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. భారతీయులతో సహా ప్రస్తుత అమెరికా వీసా హోల్డర్ లకు ఉపశమనం కలిగించారు. అమెరికాలో ఉండే విద్యార్ధులకు.. లక్ష డాలర్ల ఫీజు వర్తించదు అని స్పష్టం చేసింది. సెప్టెంబర్ 19 న ఈ నిర్ణయం అమలులోకి వచ్చినప్పుడు.. అందరికి వర్తిస్తుందని అమెరికా స్పష్టం చేసింది. కానీ కార్పోరేట్ కంపెనీలు ఆందోళన వ్యక్తం చేయడంతో ఈ నిర్ణయంలో మార్పులు చేసింది.
Also Read : పాక్ ఏడుపు అందుకే.. ఆఫ్ఘన్ మాజీ ఎంపీ సంచలన కామెంట్స్..!
అక్టోబర్ 20న విడుదల చేసిన మార్గదర్శకాల్లో విద్యార్ధి దేశం విడిచి వెళ్ళకుండా అమెరికాలోనే ఉంటే.. లేదంటే అమెరికాలో ఉండేందుకు అప్లికేషన్ దాఖలు చేస్తే హెచ్ 1 బీ వీసాకు లక్ష డాలర్ల ఫీజు ఉండదు. అలాగే అమెరికా వెలుపల ఉన్న హెచ్ 1 బీ వీసాతో ఉన్న కార్మికులు.. దేశం బయట ఉన్నా.. లోపల ఉన్నా సరే, కొత్త అప్లికేషన్ పై నిర్ణయం వచ్చే వరకు లక్ష డాలర్ల ఫీజు వర్తించదు. ఈ నిర్ణయం తక్షణమే అమలులోకి వస్తుందని అమెరికా సర్కార్ పేర్కొంది.