ఏదైనా పండగలు, అత్యంత ప్రాముఖ్యత ఉన్న రోజులు వస్తే సినిమాల రిలీజ్ పై అత్యంత ఆసక్తి నెలకొంటుంది. అగ్ర హీరోల సినిమాలపై ఉండే పోటీ అంతా ఇంతా కాదు. ప్రస్తుతం ఆగస్ట్ 15 ఈ సినీ పోటీకి వేదిక అవుతోంది. తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్, టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ ది మాసేస్, బాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ ల సినిమాలు విడుదలకు రెడీగా ఉన్నాయి. భారీ అంచనాలతో వస్తోన్న ఈ సినిమాలపై పాన్ ఇండియా లెవెల్ లో ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ లు సినిమాలపై అంచనాలు పెంచేశాయి.
Also Read : అడ్డంగా బుక్కైన జోగి..!
ఇక ప్రీ రిలీజ్ మార్కెట్, సినిమాల బడ్జెట్ కూడా ఫ్యాన్స్ లో జోష్ పెంచుతున్నాయి. ప్రస్తుతం ఈ రెండు భారీ బడ్జెట్ సినిమాలే ఇండియా వైడ్ గా రిలీజ్ కావడంతో ఆగస్ట్ 15కు ఎవరు విజేతగా నిలవబోతున్నారు అనేది ఆసక్తిగా మారింది. అయితే ఈ విషయంలో మొదటి పోటీలో రజనీ కాంత్ విజేతగా నిలిచాడు అంటున్నాయి సినీ వర్గాలు. అడ్వాన్స్ బుకింగ్ లో రజనీ కాంత్ డామినేషన్ ఓ రేంజ్ లో ఉందట. ఈ వారం ప్రారంభంలోనే ఓవర్సీస్ మార్కెట్లలో రెండు చిత్రాలకు అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది.
Also Read : దేవర ఫ్యాన్స్ కు షాక్.. వార్ 2 లో ఆ సాంగ్ కష్టమే..?
బాలీవుడ్ హంగామా నివేదిక ప్రకారం, రజనీకాంత్.. హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ కంటే డామినేషన్ కంటిన్యూ చేస్తున్నాడు. ఇప్పటి వరకు కూలీ రూ. 27 కోట్ల విలువైన టిక్కెట్లను విక్రయించగా.. వార్ 2 ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ కేవలం రూ. 4.50 కోట్లు మాత్రమే, ఆరు రెట్లు ఎక్కువ కలెక్షన్ లు కూలీ సాధించింది. ఇక కూలీ అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటివరకు తమిళనాడు, కేరళలో ప్రారంభమయ్యాయి. ఇక పాన్ ఇండియా లెవెల్ లో వార్ 2 అడ్వాన్స్ బుకింగ్లు ఆగస్టు 10 ఆదివారం ప్రారంభమవుతాయి.