Sunday, March 22, 2026 07:27 AM
Sunday, March 22, 2026 07:27 AM

వార్ 2 పై కూలీ డామినేషన్ లెక్కలు ఇవే.. ఈ రేంజ్ లోనా..?

ఏదైనా పండగలు, అత్యంత ప్రాముఖ్యత ఉన్న రోజులు వస్తే సినిమాల రిలీజ్ పై అత్యంత ఆసక్తి నెలకొంటుంది. అగ్ర హీరోల సినిమాలపై ఉండే పోటీ అంతా ఇంతా కాదు. ప్రస్తుతం ఆగస్ట్ 15 ఈ సినీ పోటీకి వేదిక అవుతోంది. తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్, టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ ది మాసేస్, బాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ ల సినిమాలు విడుదలకు రెడీగా ఉన్నాయి. భారీ అంచనాలతో వస్తోన్న ఈ సినిమాలపై పాన్ ఇండియా లెవెల్ లో ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ లు సినిమాలపై అంచనాలు పెంచేశాయి.

Also Read : అడ్డంగా బుక్కైన జోగి..!

ఇక ప్రీ రిలీజ్ మార్కెట్, సినిమాల బడ్జెట్ కూడా ఫ్యాన్స్ లో జోష్ పెంచుతున్నాయి. ప్రస్తుతం ఈ రెండు భారీ బడ్జెట్ సినిమాలే ఇండియా వైడ్ గా రిలీజ్ కావడంతో ఆగస్ట్ 15కు ఎవరు విజేతగా నిలవబోతున్నారు అనేది ఆసక్తిగా మారింది. అయితే ఈ విషయంలో మొదటి పోటీలో రజనీ కాంత్ విజేతగా నిలిచాడు అంటున్నాయి సినీ వర్గాలు. అడ్వాన్స్ బుకింగ్ లో రజనీ కాంత్ డామినేషన్ ఓ రేంజ్ లో ఉందట. ఈ వారం ప్రారంభంలోనే ఓవర్సీస్ మార్కెట్లలో రెండు చిత్రాలకు అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది.

Also Read : దేవర ఫ్యాన్స్ కు షాక్.. వార్ 2 లో ఆ సాంగ్ కష్టమే..?

బాలీవుడ్ హంగామా నివేదిక ప్రకారం, రజనీకాంత్.. హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ కంటే డామినేషన్ కంటిన్యూ చేస్తున్నాడు. ఇప్పటి వరకు కూలీ రూ. 27 కోట్ల విలువైన టిక్కెట్లను విక్రయించగా.. వార్ 2 ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్‌స్ కేవలం రూ. 4.50 కోట్లు మాత్రమే, ఆరు రెట్లు ఎక్కువ కలెక్షన్ లు కూలీ సాధించింది. ఇక కూలీ అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటివరకు తమిళనాడు, కేరళలో ప్రారంభమయ్యాయి. ఇక పాన్ ఇండియా లెవెల్ లో వార్ 2 అడ్వాన్స్ బుకింగ్‌లు ఆగస్టు 10 ఆదివారం ప్రారంభమవుతాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్