Sunday, June 21, 2026 01:55 PM
Sunday, June 21, 2026 01:55 PM

మరో సీనియర్ కు గవర్నర్ పదవి..?

ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న ఎన్డియేలో గవర్నర్ పదవుల సందడి ఎక్కువగా కనపడుతోంది. రాజకీయంగా వాతావరణం బాగుండటంతో భవిష్యత్తులో ఎలా ముందుకు వెళ్ళాలనే దానిపై జాగ్రత్తగా అడుగులు వేస్తోంది కూటమి. తమ పార్టీ సీనియర్ నేతలకు గౌరవ పదవులు ఇప్పించే దిశగా సీఎం చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారు. లేటెస్ట్ గా గోవా గవర్నర్ గా అశోక్ గజపతి రాజును రాష్ట్రపతి ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.

Also Read : ఈరోజు (18-07-2025) రాశి ఫలితాలు

దీనితో మరో సీనియర్ నేతకు కూడా గవర్నర్ పదవి దక్కే అవకాశాలు ఉన్నాయనే టాక్ వినపడుతోంది. ఆయనే కేఈ కృష్ణమూర్తి. టీడీపీలో ఒకప్పుడు బలమైన నాయకుడిగా ఓ వెలుగు వెలిగిన ఆయన.. గత ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితుడిగా కూడా ఆయనకు పేరుంది. ఆయన కుమారుడు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనకు కూడా గవర్నర్ పదవి ఇప్పించే దిశగా చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నట్టు రాజకీయ వర్గాలు అంటున్నాయి.

Also Read : ఏడు నెలల్లో అమెరికా ఎంత మందిని బహిష్కరించిందో తెలుసా..?

ఆయనను దాదాపుగా తమిళనాడు గవర్నర్ లేదా పాండిచ్చేరి గవర్నర్ గా నియమించే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చే జరుగుతోంది. తమిళం కూడా మాట్లాడే ఆయనకు.. ఆ రెండు ప్రాంతాల్లో ఏదోక రాష్ట్రం బాధ్యత అప్పగించాలని చంద్రబాబు కేంద్రాన్ని కోరగా.. సానుకూల సమాధానమే వినపడినట్టు సమాచారం. ఆయనతో పాటుగా మరో సీనియర్ నేతకు సైతం కేంద్రంలో పదవి దక్కే అవకాశాలు ఉండవచ్చు అంటున్నాయి టీడీపీ వర్గాలు. తమిళనాడులో ఎన్నికలు ఉన్న నేపధ్యంలో బిజేపి ఈ అడుగులు వేసే అవకాశాలు ఉండవచ్చు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

SBI వర్సెస్ తెలంగాణా...

రాయదుర్గం భూముల కేటాయింపు వ్యవహారంలో స్టేట్...

తిరుపతిలో కేఎఫ్‌సీ, డొమినోస్‌...

ప్రముఖ అంతర్జాతీయ ఫుడ్ బ్రాండ్ల ఆహార...

తిరుపతిలో వడ్డీ మాఫియా.....

తిరుపతి నగరంలో వడ్డీ వ్యాపారం పేరుతో...

సాయికృష్ణ కేసులో వైసీపీ...

విజయవాడ రౌడీ షీటర్‌ గాదె సాయికృష్ణ...

బ్రేకింగ్: అల్లు అర్జున్‌...

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య...

తెలంగాణాలో జనసేన తొలి...

గత కొన్నాళ్ళుగా తెలంగాణాలో పార్టీ బలోపేతం...

పోల్స్