షోలే” ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఓ బ్యూటి. అప్పటి వరకు ఉన్న రికార్డులనే కాదు.. ఇప్పటి వరకు బ్రేక్ చేయలేని కొన్ని రికార్డులను తన ఖాతాలో వేసుకుంది ఈ అల్టిమేట్ బ్లాక్ బస్టర్. హీరోలే సినిమాకు గుండె కాయ కాదు విలన్ కూడా అని నిరూపించి.. విలన్ ను కూడా ఓ రేంజ్ లో ఫేమస్ చేసిన సినిమా ఇది. ఇప్పటికీ ఈ సినిమా టీవీ లో వస్తే చూసే ఫ్యాన్స్ ఉన్నారు. నేటి తరానికి కూడా ఎంతగానో నచ్చే సినిమా ఇది. ఎంతో మంది నటులకు సినిమా పరిశ్రమలో ప్రాణం పోసిన సినిమాగా కూడా ఈ సినిమాను చెప్తారు.
Also read ; భారత్ లో అడుగు పెడుతున్నాం.. ట్రంప్ సంచలన ప్రకటన
అలాంటి సినిమాపై ఓ పాశ్చ్యాత్య దేశం తన ప్రేమ చూపించింది. షోలే 50వ విడుదల వార్షికోత్సవానికి ఒక నెల ముందు , ఇరాన్ తన వార్తాపత్రికలలో పూర్తి పేజీని కేటాయించి కథనం రాసింది. 1975లో వచ్చిన ఈ సినిమాను, చిత్ర బృందాన్ని అభినందించింది. అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర, హేమ మాలిని, సంజీవ్ కుమార్, జయ బచ్చన్, అమ్జద్ ఖాన్ వంటి స్టార్ లు నటించిన ఈ సినిమాకు . రమేష్ సిప్పీ దర్శకత్వం వహించగా, సలీం ఖాన్, జావేద్ అక్తర్ సహ రచయితలుగా వ్యవహరించారు.
Also read ; మేము లోంగిపోతాం.. మావోయిస్ట్ పార్టీ అగ్ర నేతల సమాచారం
ముంబైలోని ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ కాన్సులేట్ జనరల్ అధికారిక X పేజీ ప్రకారం, షోలే సినిమాకు ఇరాన్ లో ఇప్పటికీ ఆదరణ ఉందట. గబ్బర్ సింగ్ ఇరాన్ లో కూడా ఫేమస్ అయ్యాడని అక్కడి పౌరులు ఆ పోస్ట్ కింద కామెంట్స్ కూడా చేసారు. షోలే సినిమా 50 ఏళ్ళు పూర్తి చేసుకుంటుందని.. ఈ సినిమాలో ఇద్దరి మధ్య స్నేహాన్ని చాలా గొప్పగా చూపించారు అంటూ కొనియాడింది. ఉర్దూలో ఉన్న ఆ పత్రిక పేజీని కూడా పోస్ట్ చేసింది. ఈ సినిమాలో కొన్ని ఫేమస్ డైలాగులు మనకు ఇప్పటికీ వినపడతాయి.




