విదేశాల్లో స్థిరపడాలి అని భావించే వారికి మరో దేశం గుడ్ న్యూస్ చెప్పింది. అమెరికా తరహాలోనే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తన నూతన రెసిడెన్సీ పాలసీని అన్ని రంగాల నిపుణులకు మరింత అందుబాటులోకి తెచ్చింది. ఈ గల్ఫ్ దేశం.. నామినేషన్ ను బేస్ చేసుకుని.. కొత్త రకం గోల్డెన్ వీసాను ప్రవేశపెట్టింది. కొన్ని షరతులతో ఈ వీసాను అందుబాటులోకి తీసుకొచ్చింది. దేశంలో వ్యాపారంలో పెద్ద మొత్తం పెట్టుబడి పెట్టే వారికి మాత్రం కాకుండా ఇతరులకు కూడా ఇవ్వడానికి సిద్దపడింది ఆ దేశం.
Also Read : అప్పుడు లేని నొప్పి ఇప్పుడు ఎందుకు..? మస్క్ పై ట్రంప్ సీరియస్
ఈ గోల్డెన్ వీసా నర్సులు, విద్యావేత్తలు, కంటెంట్ క్రియేటర్లను లక్ష్యంగా చేసుకుని ప్రవేశపెట్టారు. 2019లో ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని మొదట.. మొదట రియల్ ఎస్టేట్ పెట్టుబడి పెట్టే వారి కోసం తీసుకొచ్చారు. 2022లో, 10 సంవత్సరాల వీసా కోసం కనీస ఆస్తి పరిమితిని AED 2 మిలియన్లకు తగ్గించారు. దీనితో పెద్ద ఎత్తున ఆ రంగంలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చారు. ఇతర వ్యాపారాలకు కూడా దీనిని అందుబాటులోకి తీసుకొచ్చింది అక్కడి ప్రభుత్వం.
Also Read : ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో 7వ తరగతి బాలిక చిచ్చు
ఉన్నత చదువులు చదివే విద్యార్ధులకు కూడా మే నెలలో గోల్డెన్ వీసాను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇప్పుడు శాస్త్రవేత్తలు, కార్యనిర్వాహకులు, ఫ్రంట్లైన్ కార్మికులు, పాఠశాల ఉపాధ్యాయులు, ప్రిన్సిపాల్లు మరియు విశ్వవిద్యాలయ అధ్యాపకులు, 15+ సంవత్సరాల అనుభవం ఉన్న నర్సులు, యూట్యూబర్లు, పాడ్కాస్టర్లు, డిజిటల్ క్రియేటర్లు, 25 ఏళ్లు పైబడిన గుర్తింపు పొందిన ఇ-స్పోర్ట్స్ నిపుణులు, లగ్జరీ యాచ్ యజమానులు సహా తదితరులకు గోల్డెన్ వీసాను అనుమతించారు. ఈ నిర్ణయం భారతీయులకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది.