Thursday, February 5, 2026 06:45 AM
Thursday, February 5, 2026 06:45 AM

ఉగ్రవాదులతో ఉలిక్కిపడిన రాయలసీమ

దక్షిణాది రాష్ట్రాల్లో ఉగ్రవాద కార్యాకలాపాలు ఆందోళన కలిగిస్తున్నాయి. పహల్గాం దాడి తర్వాత దక్షినాదిలో ఉగ్రవాద కార్యకలాపాల గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇటీవల విజయవాడలో ఉగ్రవాదులు ఉన్నారనే ఓ వార్త ప్రజలని భయపెట్టిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత విజయవాడ కానూరు సమీపంలో అనుమానాస్పదంగా ఉన్న విదేశీయులను అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక విజయనగరంలో కూడా పేలుళ్లకు పాల్పడాలి అని ప్లాన్ చేసిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరు పేలుళ్లకు పాల్పడటంతో నైపుణ్యం సంపాదించినట్లు విచారణలో వెల్లడైన సంగతి కూడా తెలిసిందే.

Also Read : ముందు ఆ విషయం పై క్లారిటీ ఏదీ..?

ఇప్పుడు రాయలసీమ జిల్లాల్లో కూడా ఉగ్రవాదుల కదిలికల గురించి ఆందోళన మొదలైంది. ఉగ్రవాద నెట్వర్క్ ను పోలీసులు బయటకు లాగారు. రాయచోటిలో తీవ్రవాద కార్యకలాపాలతో సంబంధం ఉన్న ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు సోదరులను అదుపులోకి తీసుకున్న ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు.. రహస్య ప్రచారంలో విచారిస్తున్నట్టు సమాచారం. చెన్నె ఐబీ పోలీసుల అదుపులో అబూబకర్ సిద్ధిఖీ, మహమ్మద్ అలీ ఉన్నట్టు తెలుస్తోంది. కోయంబత్తూరు పేలుళ్ల కుట్ర పతక రచన కేసులో ఇద్దరు ప్రధాన నిందితులు అని భావిస్తున్నారు.

Also Read : దుబారాలో పరాకాష్ట.. ఇదేందయ్యా..!

అప్పట్లో అడ్వాణీ రథయాత్ర సందర్భంగా పేలుళ్లకు కుట్ర పన్నినట్టు గుర్తించారు. 1995లో కోయంబత్తూరు బాంబు పేలుళ్ల కేసుల్లోనూ ఇద్దరు నిందితులుగా భావించినట్టు తెలుస్తోంది. 30 ఏళ్లుగా రాయచోటిలో మారుపేర్లతో చీరల వ్యాపారం చేస్తున్న సోదరుల ఇంట్లో తీవ్రవాద కార్యకలాపాల పుస్తకాలు, సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంతో ఒక్కసారిగా రాయలసీమ ఉలిక్కిపడింది. వీరికి స్థానికులు ఎవరైనా సహకరిస్తున్నారా అనే దానిపై ఆరా తీస్తున్నారు పోలీసులు. వీరి బంధువులను కూడా విచారించే అవకాశం ఉంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

గుంటూరు కారమా.. మజాకానా…!

గుంటూరు కారం పవర్ ఇన్నాళ్లకు కన్పించింది.....

బాబు-పవన్ భేటీ.. ఆ...

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...

చంద్రబాబు సలహదారుగా మళ్లీ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్...

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

పోల్స్