Thursday, February 5, 2026 04:32 PM
Thursday, February 5, 2026 04:32 PM

కర్ణాటకకు పాకిన ఫోన్ ట్యాపింగ్.. భయంతోనే వాళ్ళ ఫోన్లు కూడా..?

తెలంగాణాలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంచలన విషయాలు ఆందోళన కలిగిస్తున్నాయి. రాజకీయ నాయకులు మొదలుకుని.. సినిమా వాళ్ళ వరకు పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు ఆధారాలను సిట్ సేకరించడం, ఒక్కొక్కరిని విచారణకు పిలవడం కలకలం రేపుతోంది. హీరోయిన్ల ఫోన్లు, జర్నలిస్ట్ ల ఫోన్ లు కూడా ట్యాప్ కావడంతో వారిని విచారిస్తున్నారు. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారి ఫోన్ లు ట్యాప్ అయ్యాయి అనే ప్రచారం సైతం జరిగింది. ఇప్పుడు మరో విషయం వెలుగులోకి వచ్చింది.

Also Read : మరో ఇద్దరు హీరోయిన్ల ఫోన్ ట్యాప్..?

కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన కాంగ్రెస్ కీలక నేతల ఫోన్ లు కొన్ని ట్యాప్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. హైదరాబాద్ వేదికగా కాంగ్రెస్ నాయకుల ఫోన్లను టార్గెట్ చేసినట్టు సమాచారం. వీరిలో కర్ణాటక కాంగ్రెస్ అగ్ర నేతల పేర్లే ప్రముఖంగా వినపడుతున్నాయి. తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీని బలపరిచే ప్రయత్నం చేసిన నాయకుల అందరి ఫోన్ లు ట్యాప్ అయి ఉండవచ్చని భావిస్తున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు టీం ఫోన్ లు ట్యాప్ అయినట్టు ఓ వార్త బయటకు వచ్చింది.

Also Read : ఆ విషయంలో జగన్ భయపడుతున్నారా..?

కర్ణాటక, తెలంగాణా ఎన్నికల్లో సునీల్ టీం పని చేసింది. ఇక కర్ణాటక నాయకులు తెలంగాణాలో కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చేందుకు కష్టపడ్డారు. అందులో డీకే శివకుమార్, దినేష్ గుండూరావు, కేసీ వేణు గోపాల్ సహా పలువురు నేతలు ఉండవచ్చని భావిస్తున్నారు. మహారాష్ట్ర కాంగ్రెస్ నాయకుల ఫోన్లను సైతం ట్యాపింగ్ చేసారు అనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరి వారిని కూడా సిట్ విచారిస్తుందా లేదా చూడాలి. ఇప్పటికే కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫోన్ ట్యాప్ అయినట్టు గుర్తించారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఏ ఒక్కడినీ వదిలిపెట్టం.....

కల్తీ నెయ్యి వ్యవహారం, తిరుమల లడ్డూ...

తెలంగాణకు ఎవరు జాతిపిత..?

తెలంగాణలో మునిసిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా...

యాటిట్యూడ్ స్టార్‌.. “గుంజి...

సినిమా అంటే.. నలుగురు చూసేది.. అందులో...

మల్లన్న దగ్గర కూడా...

2019 నుంచి 2024 వరకు ఏపీలో...

వాళ్లను ఎందుకు అరెస్టు...

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్...

గుంటూరు కారమా.. మజాకానా…!

గుంటూరు కారం పవర్ ఇన్నాళ్లకు కన్పించింది.....

పోల్స్