Friday, September 12, 2025 09:17 PM
Friday, September 12, 2025 09:17 PM
roots

తొలి మహానాడులో ఏం జరిగిందో తెలుసా..?

తెలుగుదేశం పార్టీ తొలి మహానాడు అత్యంత ఉత్కంఠ పరిస్థితుల మధ్య జరిగినట్టు తెలుస్తోంది. స్వర్గీయ నందమూరి తారక రామారావుకు ఎవ్వరూ కూడా సలహాలు, సూచనలు ఇచ్చే సాహసాలు చేయలేరు గనక మొత్తం కార్యక్రమం ఎన్టీఆర్ ఆలోచనలకు అనుకూలంగా జరిగినట్టు చెప్తుంటారు. మొదట్లో మహానాడు అంటే సమావేశమా? వేడుకా? బహిరంగ సభా అని చాలా మంది నేతలకు అర్థం కాలేదు. తర్వాత తెలిసింది తెలుగు తమ్ముళ్ల అతిపెద్ద పండగగా అవతరించబోతోంది ఈ మహానాడు అని.

Also Read : లోకేష్ ఢిల్లీ టూర్.. మోడీ చేతిలో కీలక ఆధారాలు..?

తెలుగు దేశం పార్టీ తొలి మహానాడును 1983 మే 26, 27, 28 తేదీల్లో నిర్వహించారు. తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం తొమ్మిది నెలల్లోనే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు ఎన్టీఆర్. పార్టీ అధికారంలోకి వచ్చిన కొన్ని రోజులకే టీడీపీ తొలి మహానాడు జరగడంతో, ఎంతో అట్టహాసంగా జరిగింది. తెలుగు తమ్ముళ్లు పండుగలా భావించారు. విజయవాడలోని శ్రీకృష్ణదేవరాయ మున్సిపల్ స్టేడియంలో తెలుగు దేశం పార్టీ ప్రధమ మహాసభ జరిగింది. చివరి రోజైన మే 28న భవానీపురం మీదుగా బందర్ రోడ్డు వరకు బ్రహ్మండమైన ఊరేగింపు జరిగింది. తెలుగు తమ్ముళ్ల ర్యాలీతో విజయవాడ మొత్తం పసుపుమయంగా మారిందని చెబుతారు. అదే రోజు సాయంత్రం శాతవాహన్ నగర్ లోని సిద్ధార్థ మెడికల్ కాలేజీ ఎదురుగా భారీ బహిరంగ సభ నిర్వహించారు అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు.

Also Read : వందేళ్ల పండుగకు పసందైన విందు..!

తెలుగు దేశం పార్టీ ప్రధమ మహాసభలు అప్పట్లో దేశంలో చర్చనీయాంశంగా మారాయి. కాంగ్రెస్ కోటలు బద్దలు కొట్టి అధికారంలోకి వచ్చిన అన్న ఎన్టీఆర్ కు దేశ వ్యాప్తంగా క్రేజీ వచ్చింది. కాంగ్రెస్ వ్యతిరేక శక్తులకు ఆయన కేంద్రంగా మారిపోయారు. అందుకే తెలుగుదేశం మహాసభలకు ఎన్టీఆర్ పిలవగానే.. అప్పటి కాంగ్రెసేయేతర పార్టీల నేతలంతా విజయవాడ వచ్చేశారు.

Nandamuri Taraka Rama Rao

అప్పటి రాజకీయాల్లో ఓ వెలుగు వెలుగుతున్న ఎంజీ రామచంద్రన్, బాబు జగ్జీవన్ రావు, ఫరూఖ్ అబ్దుల్లా, హెచ్ఎస్ బహుగుణ, చండ్ర రాజేశ్వర్ రావు ఈ మహానాడుకు హాజరయ్యారు. భారతీయ జనతా పార్టీ నుంచి ఎల్ కే అద్వానీ, అటల్ బిహార్ వాజ్ పేయ్, రామకృష్ణ హెగ్దే, అజిత్ సింగ్, శరద్ పవార్, ఉన్నికృష్ణన్, ఎస్ఎస్ మిశ్రా, రవీంద్ర వర్మ, మేనకాగాంధీలు హాజరయ్యారు. ఒక రకంగా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పోరాడుతున్న నేతలంతా తెలుగుదేశం పార్టీ ప్రధమ మహానాడు సభకు రావడం అప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది.

Also Read : వైసీపీ – టీడీపీ మధ్య ప్యాలెస్ వార్..!

తెలుగుదేశం పార్టీ మహానాడు కోసం వచ్చిన ప్రతినిధుల కోసం కృష్ణా నది సమీపంలో ప్రత్యేక కుటీరాలు నిర్మించారు. ఆ ప్రాంతాన్ని ఇప్పటికీ మహానాడు కాలనీ అనే పిలుస్తారు. ఇక మహానాడుకు వచ్చిన జాతీయ నేతల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. టీడీపీ మహానాడులో ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అప్పటి ప్రముఖ సినీ కళాకారులు వినోద కార్యక్రమాలతో అలరించారు. మొత్తంగా 1983 మే26, 27, 28 తేదీల్లో విజయవాడలో అప్పటి ముఖ్యమంత్రి అన్న ఎన్టీ రామారావు అధ్యక్షతన జరిగిన తెలుగుదేశం పార్టీ ప్రధమ మహాసభలు చరిత్రలో నిలిచిపోయేలా జరిగాయని అంటారు. మహానాడు వంటి అరుదైన ఘనత ఏ పార్టీకి దక్కలేదనే చర్చ కూడా ప్రజల్లో చోటుచేసుకుంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్