దర్శక ధీరుడు రాజమౌళి సినిమా అనగానే నార్మల్ సినిమా ఆడియన్స్ లో ఉండే క్రేజ్ వేరే లెవెల్ లో ఉంటుంది. సినిమా సినిమాకు తన రేంజ్ పెంచుకుంటూ పోతున్న రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో హాలీవుడ్లో పాగా వేయాలని రాజమౌళి టార్గెట్ గా పెట్టుకుని పక్క కమిట్మెంట్ తో చేస్తున్నాడు. సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ 20% కంప్లీట్ చేశాడు. గతంలో కంటే ఇప్పుడు ఈ సినిమాను చాలా వేగంగా కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకొని వర్క్ చేస్తున్నాడు. అటు మహేష్ బాబు కూడా ఈ సినిమా కోసం ఎక్కువ టైం ఇచ్చేసాడు.
Also Read : ఏబీవీ పొలిటికల్ ఎంట్రీ.. జగన్ నెవర్ ఎగైన్..!
గుంటూరు కారం సినిమా ఫ్లాప్ తో కాస్త షాక్ లో ఉన్న మహేష్ బాబు ఈ సినిమాతో ఎలాగైనా సరే పాన్ ఇండియా లెవెల్ లో హిట్ కొట్టాలని వర్కౌట్ చేస్తున్నాడు. రీసెంట్గా ఒరిస్సాలో ఈ సినిమా షూటింగ్ కొంత కంప్లీట్ అయింది. హీరోయిన్ ప్రియాంక చోప్రా హీరో మహేష్ బాబు మధ్య కొన్ని కీలక సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరించారు. అలాగే మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, మహేష్ బాబు మధ్య కూడా కొన్ని సన్నివేశాలను ఇక్కడ రాజమౌళి షూట్ చేశారు.
Also Read : పవన్ ఇంటికి బన్నీ.. అంతా సెట్ అయిందా..?
ఇదిలా ఉంచితే ఇప్పుడు మహేష్ బాబు వెకేషన్ నుంచి వచ్చేసాడు. ఒడిస్సాలో షూటింగ్ అయిన తర్వాత వెకేషన్ కి వెళ్ళిన మహేష్ బాబు మళ్లీ సినిమా షూటింగ్లో పాల్గొనేందుకు రెడీ అవుతున్నాడు. జపాన్ లో త్రిబుల్ ఆర్ సినిమా రిలీజ్ ఉండడంతో రాజమౌళి కూడా ఈ మధ్య కాస్త బిజీగానే గడిపాడు. ఇక ఇప్పుడు మహేష్ బాబు రాజమౌళి ఇద్దరు ఫ్రీ అయిపోవడంతో ఈ సినిమా షూటింగ్ మళ్లీ షురూ కానుంది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్రహం కూడా ఓ కీలక పాత్రలో నటించబోతున్నట్లు రీసెంట్గా మళ్లీ ప్రచారం మొదలైంది. అయితే జాన్ అబ్రహం పాజిటివ్ రోల్ లో నటిస్తాడా నెగిటివ్ రోలా అనేది క్లారిటీ లేదు.




