Wednesday, February 4, 2026 07:49 PM
Wednesday, February 4, 2026 07:49 PM

అమరావతికి మోడీ.. ప్రధాని కార్యాలయం కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి పనుల విషయంలో.. రాష్ట్ర ప్రభుత్వం చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నది. 40 వేల కోట్ల రూపాయల పనులకు ఒప్పందం కుదుర్చుకుంది రాష్ట్ర ప్రభుత్వం. త్వరలోనే ఈ పనులను మొదలుపెట్టనున్నారు. దీనిపై సీఆర్డీఏ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళవారం భేటీ అయ్యారు. సుదీర్ఘంగా అధికారులతో చంద్రబాబు నాయుడు చర్చించారు. ముందు ఏఏ భవనాలను పూర్తి చేయాలి అనేదానిపై ఒక ప్రణాళిక ప్రకారం వెళ్ళాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది.

Also Read : రాజకీయాలకు వంగవీటి గుడ్ బై..!

అలాగే శాశ్వత భవనాలపై కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా అసెంబ్లీ, సచివాలయం సహా కొన్ని కీలక భవనాలను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్ పెట్టుకున్నట్లు సమాచారం. ఇక రాజధాని పనుల పునః ప్రారంభానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కూడా ఆహ్వానం పంపించారు. దీనికి ప్రధాని మోడీ అంగీకారం తెలిపినట్లు సమాచారం. త్వరలో తేదీని ప్రధానమంత్రి కార్యాలయం ఖరారు చేసే అవకాశం ఉంది. వచ్చే నెలలో అట్టహాసంగా ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Also Read : వాళ్లకు లాస్ట్ వార్నింగ్.. చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు…!

తొమ్మిదేళ్ల క్రితం అమరావతి రాజధాని ప్రారంభ పనులకు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు. ఇక పునః ప్రారంభానికి కూడా ప్రధానమంత్రి మోడీ వచ్చేందుకు అంగీకారం తెలపడంతో ఆయనతో కీలక భవనానికి శంకుస్థాపన చేయించే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే అమరావతిలో చెత్త తొలగింపు పనులను కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసింది. పనులకు భూములను సిద్ధం చేసి పెట్టారు. అటు రైతులు కూడా అమరావతి పనుల కోసం ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా రోడ్డు విస్తరణ పనుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టే అవకాశాలున్నాయి. సీడ్ యాక్సెస్ రోడ్డును వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అలాగే కరకట్ట రోడ్డును కూడా విస్తరించాలని రాష్ట్రప్రభుత్వం భావిస్తుంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

గుంటూరు కారమా.. మజాకానా…!

గుంటూరు కారం పవర్ ఇన్నాళ్లకు కన్పించింది.....

బాబు-పవన్ భేటీ.. ఆ...

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...

చంద్రబాబు సలహదారుగా మళ్లీ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్...

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

పోల్స్