Wednesday, February 4, 2026 05:39 PM
Wednesday, February 4, 2026 05:39 PM

చంద్రబాబు సీఎం పదవి.. పవన్ పుణ్యమే..!

తెలుగుదేశం పార్టీ నుండి చంద్రబాబు ముఖ్యంత్రిగా ఉన్నారంటే కారణం పవన్ కళ్యాణ్యే అంటూ.. మంత్రి నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు చేసారు. జనసేన పార్టీ ప్రభుత్వం లో భాగస్వామ్యం అని మర్చిపోకండి అంటూ అమలాపురంలో నాదెండ్ల మనోహర్ హాట్ కామెంట్స్ చేసారు. రాజకీయాల్లో ప్రక్షాళన జరగాలి, వైసిపి లాంటి పార్టీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉండకూడదన్నారు ఆయన. పచ్చని కోనసీమలో రాజకీయ లబ్ధి కోసం కులాల మధ్య చిచ్చు పెట్టి సొంత పార్టీ మంత్రి ఇంటినే తగలబెట్టారు అన్నారు.

Also Read: ఇలా అయితే కష్టమే.. బాబు మాస్ వార్నింగ్..!

విశ్వరూప్ చాలా మంచి వ్యక్తి , ఆయన నేను కలిసి పనిచేశామని.. గుర్తు చేసుకున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో 12వ జనసేన ఆవిర్భావ దినోత్సవ సన్నాహక సమావేశంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేసారు. కోనసీమ జిల్లా జనసేన పార్టీకి గుండెకాయ లాంటిదన్నారు. కులాల మధ్య చిచ్చు పెట్టి అమాయకులను ఇబ్బందులకు గురిచేశారని.. టిడిపి నుండి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారంటే కారణం పవన్ కళ్యాణ్ మాత్రమే అని స్పష్టం చేసారు.

Also Read: కాంగ్రెస్ లో దొంగలు.. రాహుల్ గాంధీ సంచలనం

కూటమి ఏర్పడి అధికారంలోకి రావడానికి కేవలం పవన్ కళ్యాణ్ పుణ్యమే అన్నారు. నియోజక వర్గంలో జరుగుతున్న విభేదాలు పక్కన పెట్టీ పార్టీని బలోపేతం చేయాలంటూ పార్టీ నేతలకు ఆయన సూచించారు. 14వ తేదీన జరగబోయే పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో రాబోయే రోజుల్లో ఎలా ముందుకు వెళ్లలో పవన్ కళ్యాణ్ వివరిస్తారని అన్నారు. ఆవిర్భావం సభను విజయంతం చేయాలని సూచించారు. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

చంద్రబాబు సలహదారుగా మళ్లీ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్...

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

పోల్స్