Wednesday, August 5, 2026 07:41 PM
Wednesday, August 5, 2026 07:41 PM

అసెంబ్లీకి జగన్.. అనర్హత భయంతోనేనా?

వైసీపీ అధినేత వైయస్ జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని నిర్ణయం తీసుకున్నారు. సోమవారం నుంచి జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని ఎమ్మెల్సీలకు ఎమ్మెల్యేలకు జగన్ స్వయంగా ఫోన్లు చేసారు. అలాగే సభకు వచ్చే ముందు బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వంపై పోరాటం చేయడానికి పలు విషయాలపై అవగాహన పెంచుకొని రావాలని అలాగే గత ప్రభుత్వంలో తాము చేసిన మంచిని ప్రజలకు అసెంబ్లీ సమావేశాల్లో అలాగే మీడియా సమావేశాల్లో చెప్పేందుకు ప్రయత్నం చేయాలని పార్టీ నేతలకు సూచించారు.

Also Read : వైసీపీకి మరో షాక్.. పల్నాడు జిల్లా షేకింగ్ న్యూస్

ఎమ్మెల్యేలు కాని మాజీ మంత్రులు మీడియా సమావేశాలలో అందుబాటులో ఉండాలని జగన్ ఆదేశించారు. ఇప్పటివరకు ప్రభుత్వం మారిన తర్వాత జగన్ సమావేశాలకు హాజరు కాలేదు. ప్రతిపక్ష హోదా ఇస్తే గాని సభకు రానంటూ గతంలో జగన్ ప్రకటించారు. 10% సీట్లు కూడా లేకపోవడంతో ప్రతిపక్ష హోదా వైసిపి కోల్పోయింది. వరుసగా 60 రోజులు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోతే శాసనసభ సభ్యత్వం కోల్పోయే ప్రమాదం ఉండవచ్చని, సభకు హాజరై ఆ ముప్పు నుంచి తప్పించుకోవాలని జగన్ భావిస్తున్నారు.

Also Read : సోషల్ మీడియా పోస్టులకు ఘాటు కౌంటర్లు..!

జగన్ తో పాటుగా మరో 10 మంది ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని.. 60 రోజులు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోతే పులివెందులకు ఉప ఎన్నిక రావడం ఖాయమని హెచ్చరించారు. ఈ పరిస్థితులు నేపథ్యంలో జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని నిర్ణయం తీసుకోవడం సంచలనం అవుతుంది. అయితే జగన్ అసెంబ్లీ సమావేశాలకు కంటిన్యూగా వస్తారా లేదా అనేదానిపై మాత్రం ఇంకా క్లారిటీ లేదు. ఇక జగన్ సమావేశాలకు హాజరు కావడంతో అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా సిద్ధమవుతోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

పార్లమెంట్ లో దుమ్మురేపిన...

సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంపు బిల్లు-2026...

తెలంగాణలో డయల్ 100కు...

తెలంగాణ రాష్ట్రంలో దశాబ్దాలుగా ప్రజల నాడిలో,...

జంతర్ మంతర్ నిరసనల్లో...

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్...

బీసీలకు ఏపీ సర్కార్...

ఆంధ్రప్రదేశ్‌లో వెనుకబడిన తరగతుల సామాజికవర్గాల భద్రత,...

కృష్ణా నదిని మింగేస్తున్నారా..?...

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలో కృష్ణానది...

మళ్లీ వైసీపీలోకి విజయసాయిరెడ్డి..?...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం...

పోల్స్