Friday, September 12, 2025 09:04 PM
Friday, September 12, 2025 09:04 PM
roots

వైసీపీలో లోఫర్లు ఎక్కువ.. జగన్ పై వసంత సంచలన కామెంట్స్

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పై ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేసారు. వైసీపీ లో లీడర్ల కంటే లోఫర్లు ఎక్కువ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. దావోస్ వెళ్ళి పబ్జీ ఆడుకుని, బజ్జీలెక్కడ దొరుకుతాయో వెతుక్కుంటూ స్వెట్టర్ వేసుకుని తిరిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని ఆరోపించారు. దావోస్ పర్యటన పై వైసీపీ నాయకుల మాటలు పనీ పాటా లేని విమర్శలని మండిపడ్డారు. రాష్ట్రం పట్ల చిత్తశుద్ధి కలిగిన నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడని ఈ రాష్ట్రంలో వ్యాపార సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి తీరుతో భయపడుతున్నారంటూ సంచలన కామెంట్స్ చేసారు.

Also Read: విజయసాయి ఫ్యూచర్ ప్లాన్ ఇదే..!

వైసీపీలో రెండవ స్థానంలో ఉన్న విజయసాయిరెడ్డి ఆకస్మికంగా ఆ పార్టీని వదిలి వెళ్ళారంటే అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవాలి అని నిలదీశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి కి రామచంద్రరావు ఆత్మ అయితే, జగన్మోహన్ రెడ్డి కి విజయసాయిరెడ్డి ఆత్మ అన్నారు. భవిష్యత్ లో చాలా మంది వైసీపీ ని వీడతారు, 3 నెలల్లో మిగిలిన లీడర్లు కూడా ఆ పార్టీ నుండి బయటకు వస్తారని వ్యాఖ్యలు చేసారు. మునిగిపోయే పడవ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్నారు వసంత. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పరిశ్రమలు స్థాపించడానికి ముందుకు వస్తే ఇక్కడ వద్దని వేరే జిల్లాలకు పంపిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని మండిపడ్డారు.

Also Read: బాలయ్యకు పద్మ పురస్కారం అవసరమా..?

ఆంద్రప్రదేశ్ రాష్ట్రం సంక్షేమం, అబివృద్ది రెండు కళ్ళు గా ముందుకెళ్ళాలంటే కూటమి ప్రభుత్వానికే సాధ్యమన్నారు. పరిశ్రమలతో సంపద సృష్టించి, ఆ సంపదతో అప్పులు తీర్చుతూ.. సంక్షేమ పధకాలు పేదలకు పంచడమే కూటమి లక్ష్యమని పేర్కొన్నారు. లోకేష్ డిప్యూటీ సీఎం అనేది సోషల్ మీడియా దుమారం, ఎటువంటి వ్యాఖ్యలు చేయవద్దని అధిష్టానం నుండి ఆదేశాలు ఉన్నాయన్నారు. అటువంటి నిర్ణయం ఉంటే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వెల్లడిస్తారని వ్యాఖ్యానించారు. ఈ విషయం పై ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్