Sunday, September 20, 2026 01:38 AM
Sunday, September 20, 2026 01:38 AM

ఆ ఆటగాడికి ఎందుకీ అన్యాయం..?

భారత జట్టులో ఫెయిల్ అయిన ఆటగాళ్లకు పదే పదే అవకాశాలు ఇస్తున్నారనే ప్రచారం జరుగుతున్నా సరే జట్టు యాజమాన్యం వైఖరిలో మాత్రం మార్పు లేదు. జట్టుకు సెలెక్ట్ అయి, నిలకడగా రాణించే ఆటగాళ్లకు కూడా అవకాశాలు ఇవ్వకుండా బెంచ్ కే పరిమితం చేస్తున్నారనే విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. తాజాగా మరో ఆటగాడి విషయంలో ఇప్పుడు అభిమానులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. సీనియర్ ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ ను జట్టుకు సెలెక్ట్ చేసి కూడా పక్కన పెట్టారు.

Also Read : బూతులతో రెచ్చిపోయిన అంబటి..!

పదే పదే విఫలమైన రింకు సింగ్ సహా పలువురు ఆటగాళ్లకు అవకాశం ఇస్తూ.. నిలకడగా రాణించే అయ్యర్ కు నాలుగు మ్యాచ్ లలో ఒక్క దానిలో కూడా ఛాన్స్ ఇవ్వలేదు. ఇక ఇప్పుడు చివరి మ్యాచ్ కు కూడా అతనికి అవకాశం ఇచ్చే సంకేతాలు కనపడటం లేదని తెలుస్తోంది. జట్టు యాజమాన్యం ప్రామాణికంగా తీసుకునే ఐపిఎల్ లో అయ్యర్ రాణించాడు. వైట్ బాల్ క్రికెట్ లో అతను సమర్ధవంతంగా రాణిస్తున్న పరిస్థితి. అయినా సరే టి20 లలో అతనికి అవకాశం ఇవ్వడం లేదు యాజమాన్యం.

Also Read : అజిత్ మృతి.. బీజేపీకి గోల్డెన్ ఛాన్స్..!

టి20 వరల్డ్ కప్ విషయంలో కూడా అయ్యర్ కు అన్యాయం జరగడంపై ఫ్యాన్స్ విమర్శలు చేసారు. తాజాగా కివీస్ తో జరుగుతోన్న టి20 సీరీస్ లో కూడా అతనికి ఛాన్స్ లు ఇవ్వకపోవడం, మూడు ఫార్మాట్ లలో ఆడే సత్తా ఉన్న ప్లేయర్ ను కేవలం వన్డేలకు మాత్రమే పరిమితం చేయడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. 2024 – 25 ఆస్ట్రేలియా పర్యటన, గత ఏడాది ఇంగ్లాండ్ పర్యటనకు కూడా అతనిని ఎంపిక చేయలేదు. దూకుడుగానే కాకుండా పక్కా డిఫెన్స్ టెక్నిక్ తో బ్యాటింగ్ చేయగలిగే సామర్ధ్యం ఉన్నప్పటికీ యాజమాన్యం పట్టించుకోవడం లేదు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుమల లడ్డూ పై,...

ఈడీ అంటే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌.. ఈ...

ఇప్పటికీ వారికే పదవులు.....

కూటమి ప్రభుత్వం ఏర్పడి, దాదాపు రెండున్నర...

సాయిరెడ్డి.. నెట్టుకు రాగలరా.....

కొత్త ఎపుడూ వింతే. అందుకే కొత్తగా...

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

పోల్స్