Friday, August 28, 2026 11:19 AM
Friday, August 28, 2026 11:19 AM

కేంద్రంపై విజయ్ మాల్యా సంచలన ఆరోపణలు..!

పరారీలో ఉన్న భారత వ్యాపారవేత్త విజయ్ మాల్యా తన సోషల్ మీడియా వేదికగా భారత బ్యాంకింగ్ మరియు రుణ పరిష్కార వ్యవస్థపై తీవ్ర ఆరోపణలు చేశారు. కోర్టు నిర్ధారించిన రూ. 6,203 కోట్ల అసలు అప్పునకు గాను, బ్యాంకులు మరియు భారత ప్రభుత్వం ఇప్పటికే తన నుండి రూ. 14,100 కోట్లు వసూలు చేశాయని ఆయన పేర్కొన్నారు. తన అప్పు కంటే రెండింతలు ఎక్కువ రికవరీ చేసినప్పటికీ, తనకు ఇంకా న్యాయం జరగడం లేదని మాల్యా ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read : నేపాల్ ప్రళయం.. భారత్‌కు భారీ వరద వస్తోందా..?

మరో వ్యాపారవేత్త సుభాష్ చంద్రకు సంబంధించిన రుణ పరిష్కార వ్యవహారాన్ని ఉదహరిస్తూ మాల్యా ఈ వ్యాఖ్యలు చేశారు. భారీ బకాయిలు ఉన్న చాలా మంది వ్యాపారవేత్తలు తమ మొత్తం అప్పుల్లో కేవలం ఒక చిన్న శాతాన్ని చెల్లించి రుణ సెటిల్మెంట్లు చేసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఒకరికి ఒకలా, తనకు మరొకలా వ్యవహరించడంపై మాల్యా అసంతృప్తి వ్యక్తం చేస్తూ దీనిని “భారత రుణ పరిష్కార న్యాయం” గా ఎద్దేవా చేశారు.

Also Read : ఆ విషయంలో వైసీపీ ఘోర వైఫల్యం..!

ఈ రికవరీ గణాంకాలపై గతంలో ప్రభుత్వ నివేదికలకు, బ్యాంకులు చెబుతున్న లెక్కలకు మధ్య వ్యత్యాసాలు ఉన్నాయని మాల్యా వాదించారు. ప్రస్తుతం లండన్‌లో ఉంటున్న విజయ్ మాల్యా చేసిన ఈ తాజా ట్వీట్ మరియు ఆరోపణలు ఇప్పుడు జాతీయ మీడియాలో సంచలనంగా మారాయి. తన ఆస్తుల రికవరీ పూర్తయినందున తనకు ఉపశమనం లభించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. గత ఏడాది విడుదల చేసిన ఓ పాడ్ కాస్ట్ లో కూడా విజయ్ మాల్యా ఈ అంశం గురించి ప్రస్తావించడం గమనార్హం.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

మళ్ళీ తెరమీదకు బీసీ...

మాజీ మంత్రి విడదల రజనీ అప్పుడప్పుడు...

ఏపీ లిక్కర్ స్కామ్‌లో...

గత రెండేళ్ళ నుంచి సంచలనంగా మారిన...

ఆ విషయంలో వైసీపీ...

కాలం కలిసి రాకపోతే తాడు కూడా...

తెలుగుదేశం పార్టీకి కేంద్రం...

కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్‌డీఏ సర్కార్‌లో...

దిల్ రాజుకు ఇతర...

టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు...

ఆ ప్రశ్నలకు సాయిరెడ్డి...

రాజకీయాల్లో మిత్రులు శత్రువులుగా మారడం కొత్తేమీ...

పోల్స్