నేపాల్-టిబెట్ సరిహద్దుల్లోని భోటే కోషి నదీ పరివాహక ప్రాంతంలో మంచుకొండ ముక్కలై సంభవించిన హఠాత్ ప్రళయం శ్మశాన వాటికను మిగిల్చింది. ఈ ఘోర విపత్తులో ఇప్పటివరకు 175 మందికి పైగా మరణించినట్లు అధికారిక వర్గాలు ధృవీకరించాయి. నదిలో ఒక్కసారిగా బురద, రాళ్లతో కూడిన రాక్షస ప్రవాహం దూసుకురావడంతో నదీ తీర ప్రాంతాలు, జలవిద్యుత్ కేంద్రాలు మరియు పర్యాటక మార్గాలు పూర్తిగా జలసమాధి అయ్యాయి.
Also Read : నేపాల్ ప్రళయం.. భారత్కు భారీ వరద వస్తోందా..?
ఈ జల ప్రళయంలో 300 మంది వరకు భారతీయ పర్యాటకులు, ముఖ్యంగా కైలాస మానససరోవర యాత్రికులు వరదల్లో కొట్టుకుపోయి గల్లంతైనట్లు నేపాల్ విదేశాంగ శాఖ మంత్రి శిశిర్ ఖనాల్ అత్యంత భారీ ఆందోళన వ్యక్తం చేశారు. నేపాల్ విపత్తు నిర్వహణ సంస్థ తాజా ప్రకటన ప్రకారం.. ఈ ఆకస్మిక వరదల కారణంగా మొత్తం 826 మంది ఆచూకీ లభ్యం కాకుండా పోయింది. గల్లంతైన వారిలో దాదాపు 579 మంది వివిధ దేశాలకు చెందిన విదేశీ పర్యాటకులు ఉన్నారని అధికారులు స్పష్టం చేశారు.
Also Read : తెలుగుదేశం పార్టీకి కేంద్రం కీలక పదవి..!
ప్రస్తుతం కమ్యూనికేషన్ నెట్వర్క్లు పూర్తిగా ధ్వంసం కావడం, రోడ్లు మరియు వంతెనలు కొట్టుకుపోవడంతో సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. గల్లంతైన భారతీయులను గుర్తించి సురక్షితంగా రక్షించడానికి భారత రాయబార కార్యాలయం ప్రత్యేక హెల్ప్లైన్ నంబర్లను (+977 9851316807, +977 9709107500) ఏర్పాటు చేసింది. రెస్క్యూ ఆపరేషన్లను ముమ్మరం చేయడానికి భారత వాయుసేనకు చెందిన ప్రత్యేక విమానంలో సహాయక సామగ్రిని ఇప్పటికే నేపాల్కు తరలించారు.

