Thursday, June 11, 2026 12:01 AM
Thursday, June 11, 2026 12:01 AM

వారణాసిలో 30 నిమిషాలు.. ఇండియానే షేక్ చేస్తాయట

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక పాన్-ఇండియా చిత్రం ‘వారణాసి’ కోసం సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మహేష్ బాబు నటించిన ‘గుంటూరు కారం’ తర్వాత వస్తున్న సినిమా కావడం, అలాగే వరుస విజయాలతో దూసుకుపోతున్న రాజమౌళి ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తుండటంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Also Read : ఈరోజు రాశి ఫలితాలు (10-06-2026)

ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టైటిల్ టీజర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింత పెంచాయి. అంతేకాకుండా ఈ చిత్రాన్ని పాన్-వరల్డ్ స్థాయిలో రూపొందిస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించడంతో దేశవ్యాప్తంగా సినీప్రియుల దృష్టి ఈ ప్రాజెక్ట్‌పై పడింది. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. అయితే ఈ సినిమా కథాంశం ఏమిటి? ఈసారి రాజమౌళి ప్రేక్షకులకు ఎలాంటి విజువల్ అనుభూతిని అందించబోతున్నారు? అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రముఖ కథా రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

Also Read : జాన్వీ.. గ్లామర్ రోల్స్ కే పరిమితమా..?

గతంలో జరిగిన ఓ కార్యక్రమంలో ‘వారణాసి’లోని 30 నిమిషాల సీక్వెన్స్ భారతీయ సినీ పరిశ్రమను షేక్ చేస్తుందని విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అదే విషయంపై ప్రశ్నించగా, ఆ సీక్వెన్స్ గురించి మరిన్ని వివరాలు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ, “ఆ సీక్వెన్స్ శ్రీరాముడు మరియు కుంభకర్ణుడి మధ్య జరిగే మహాయుద్ధానికి సంబంధించినది. ట్రైలర్‌లో కూడా దానికి సంబంధించిన కొన్ని విజువల్స్ చూపించారు. వానరసేనపై నిలబడి శ్రీరాముడు కుంభకర్ణుడితో యుద్ధం చేస్తున్న దృశ్యాలు ఉంటాయి. అలాగే హనుమంతుడి తోకపై రథం ప్రయాణిస్తున్న విజువల్ కూడా కనిపిస్తుంది. ఆ మొత్తం ఎపిసోడ్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసే స్థాయిలో ఉంటుంది” అని తెలిపారు.

విజయేంద్ర ప్రసాద్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇదిలా ఉంటే, ఈ చిత్రంలో మహేష్ బాబు ద్విపాత్రాభినయం చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. రుద్ర అనే పాత్రతో పాటు శ్రీరాముడి పాత్రలో కూడా ఆయన కనిపించనున్నట్లు సమాచారం. ఇక ఈ చిత్రంలో మందాకిని పాత్రలో గ్లోబల్ స్టార్ ప్రియాంకా చోప్రా జోనాస్ నటిస్తుండగా, ప్రతినాయకుడు ‘కుంభ’ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ కనిపించనున్నారని తెలుస్తోంది. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 7న విడుదల చేయాలని చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

అధికారిక ప్రకటనలు వెలువడాల్సి ఉన్నప్పటికీ, ‘వారణాసి’కి సంబంధించిన ప్రతి అప్‌డేట్ ప్రస్తుతం ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

భాగ్యనగరం.. ఒక్క వర్షం.....

భారీ వర్షం హైదరాబాద్ మహానగరాన్ని మరోసారి...

కూటమిలో కుంపటి పెట్టిన...

కూటమి పార్టీల మధ్య విభేదాలు తలెత్తాయా..?...

ఇంత చిన్న లాజిక్...

తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి...

వైసీపీ రాజకీయం.. మాయమయిన...

విశాఖపట్నంలోని రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్...

పేర్ని దూకుడుకు బ్రేకులు...

వై నాట్ 175 అన్నారు.. 30...

విశాఖ KGHకు లోకేష్‌.....

విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో జరిగిన ప్రమాదంపై తీవ్ర...

పోల్స్