Wednesday, August 12, 2026 08:24 AM
Wednesday, August 12, 2026 08:24 AM

వెనెజులాలో ‘ట్విన్’ భూకంపాలు.. మరణాల సంఖ్య ఊహకు అందదా..?

దక్షిణ అమెరికా దేశమైన వెనెజులాను నిమిషాల వ్యవధిలోనే సంభవించిన రెండు భారీ ట్విన్ భూకంపాలు కుదిపేశాయి. ఈ వినాశకర ప్రకంపనల ధాటికి రాజధాని కరాకస్‌ తో పాటు దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో భారీ నష్టం వాటిల్లింది. అమెరికా భూగర్భ శాస్త్ర సర్వే అందించిన ప్రాథమిక వివరాల ప్రకారం.. మొదటి భూకంపం రిక్టర్ స్కేలుపై 7.2 తీవ్రతతో సంభవించగా, ఆ వెంటనే కేవలం కొన్ని సెకన్ల వ్యవధిలోనే 7.5 తీవ్రతతో మరో శక్తిమంతమైన భూకంపం దేశాన్ని వణికించింది. ఈ ఘోర విపత్తు కారణంగా మృతులు మరియు క్షతగాత్రుల సంఖ్య అత్యంత భారీగా ఉండవచ్చని అంతర్జాతీయ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Also Read : సౌత్ కంటే.. బాలీవుడ్ చాలా బెటరంట..!

వరుస భూకంపాల వల్ల జరిగిన నష్టంపై యూఎస్ జియోలాజికల్ సర్వే సంచలన అంచనాలను వెలువరించింది. భూకంప తీవ్రత అత్యధికంగా ఉన్నందున దేశవ్యాప్తంగా మరణాల సంఖ్య 10,000 కు పైగా ఉండవచ్చని యూఎస్ సంస్థ అంచనా వేసింది. వందలాది బహుళ అంతస్తుల భవనాలు, నివాస గృహాలు ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో వేలాది మంది శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు సమాచారం అందుతోంది. దీంతో మృతులు, తీవ్రంగా గాయపడిన క్షతగాత్రుల సంఖ్య ఊహించని స్థాయిలో పెరిగే అవకాశం ఉందని సహాయక బృందాలు చెబుతున్నాయి.

Also Read : సీఐ నాగరాజు రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు..!

ఈ భూకంపాల ధాటికి వెనెజులాలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన సైమన్ బొలివర్ అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తిగా దెబ్బతింది. విమానాశ్రయ రన్‌ వేలపై భారీ పగుళ్లు ఏర్పడటంతో పాటు టెర్మినల్ మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి. దీంతో భద్రతా కారణాల దృష్ట్యా ఎయిర్‌ పోర్టును అధికారులు తాత్కాలికంగా మూసివేసి, అన్ని రకాల అంతర్జాతీయ, దేశీయ విమాన సర్వీసులను రద్దు చేశారు. తీవ్రమైన ఆస్తి, ప్రాణ నష్టం సంభవించిన నేపథ్యంలో వెనెజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగెస్ దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఢిల్లీ వేదికగా మళ్లీ...

రాష్ట్రంలో ప్రగల్భాలు పలికే వైకాపా అధినేత...

బాలినేని – దామచర్ల...

ఒంగోలు నియోజకవర్గంలో గత కొన్ని రోజులుగా...

మార్కాపురం జిల్లాకు కూటమి...

కొత్తగా ఏర్పడిన మార్కాపురం జిల్లా వాసులు...

జూలకంటిని ఇరికించాలని చూసిన...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పల్నాడు జిల్లా కేంద్రంగా...

సోషల్ మీడియా సైకోలపై...

సోషల్ మీడియా వేదికగా మహిళలు, కుటుంబ...

విశాఖకు రెడ్ అలెర్ట్.....

విశాఖపట్నం దేశంలోని టైర్ టూ మెగా...

పోల్స్